టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు చిత్రం ఎలాంటి బ్లాక్బస్టర్ హిట్ మూవీగా నిలిచిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాలో మహేష్ ఒక ఊరిని దత్తత తీసుకుని, ఆ గ్రామాన్ని బాగు చేస్తాడు.
ఈ సోషల్ మెసేజ్ అందరికీ నచ్చడంతో ప్రేక్షకులు ఈ సినిమాకు వారు బ్రహ్మరథం పట్టారు.ఈ సినిమాలో మహేష్ బాబు చేసిన పనిని ఇప్పుడు రియల్ లైఫ్లో చేసేందుకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సిద్ధమవుతున్నాడు.
తెలంగాణ ఎంపీ సతీష్ కుమార్ చేపట్టిన హరితహారంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ఆయన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్తో దీన్ని ప్రచారం చేయించాలని రెడీ అయ్యారు.దీనికి సంబంధించి ప్రభాస్తో ఆయన మొక్కలు నాటించారు.
కాగా ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ తెలంగాణలోని కీసర అడవిని దత్తత తీసుకోవడం హర్షించతగ్గ విషయమని, తాను కూడా తెలంగాణలోని ఏదైనా అడవిని దత్తత తీసుకుంటానని ప్రభాస్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.
కాగా ప్రభాస్ ప్రస్తుతం తన 20వ చిత్రాన్ని జిల్ ఫేం రాధాకృష్ణ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాను పీరియాడికల్ మూవీగా తెరకెక్కిస్తుండగా, ఇందులో అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది.ఇక ఈ సినిమాను యువీ క్రియేషన్స్, గోపీకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.
ఇటీవల జార్జియాలో షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా, త్వరలోనే హైదరాబాద్లో నెక్ట్స్ షెడ్యూల్ను జరుపుకునేందుకు రెడీ అవుతోంది.