దేశంలోనే అతి పెద్ద వ్యాపార సంస్థ అయిన రిలయన్స్ నుండి జియో టీవీ ప్లస్ రాబోతున్న విషయం తెల్సిందే.ఈ సెటాప్ బాక్స్లో అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
ఈ సెటాప్ బాక్స్ తీసుకుంటే అన్ని రకాల ఓటీటీ ప్లాట్ ఫామ్స్కు సంబంధించిన ఒక్క లాగిన్తో చూడవచ్చు.ఇది సరికొత్త విప్లవాత్మక మార్పు అంటూ అంతా చాలా నమ్మకంగా ఉన్నారు.
దీన్ని ఇండియాలో ప్రచారం చేసేందుకు ప్రముఖ స్టార్స్ను ఎంపిక చేసేందుకు రిలయన్స్ సంస్థ ప్రతినిధులు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఉత్తరాదిన ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోను ఇప్పటికే బ్రాండ్ అంబాసిడర్గా నియమించారట.తెలుగులో మహేష్బాబుతో చర్చలు దాదాపుగా ముగిశాయంటూ టాక్ వినిపిస్తుంది.మహేష్బాబుకు ఈ ఆఫర్తో తన బ్రాండ్స్ సంఖ్య మరింతగా పెరగడం ఖాయంగా ఉంది.
ఇందుకు గాను జియో వారు భారీ మొత్తంలో మహేష్బాబుకు పారితోషికంగా ఇస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.అయితే ఈ ఆఫర్ మొదట ప్రభాస్కు వచ్చినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రభాస్కు ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఆయన అయితే సౌత్ ఇండియా మొత్తం జియో టీవీ ప్లస్కు మంచి పబ్లిసిటీ దక్కుతుందని భావించారు.కాని ప్రభాస్ కొన్ని కారణాల వల్ల ఆ ఆఫర్కు నో చెప్పాడట.ఆ కారణాలు ఏంటీ అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్గా ఉంది.ప్రభాస్ ఫ్యాన్స్ ఈ విషయంలో చాలా నిరుత్సాహంగా ఉన్నారు.అద్బుతమైన ఆఫర్ను ప్రభాస్ వదులుకున్నాడనే విమర్శలు సైతం వస్తున్నాయి.గతంలో మహింద్ర కారుకు అంబాసిడర్గా వ్యవహరించిన ప్రభాస్ మళ్లీ వాటిపై ఆసక్తి చూపడం లేదు.
దాంతో మహేష్కు ఈ ఛాన్స్ వచ్చింది.