డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ నటిస్తున్న సినిమా ‘రొమాంటిక్’.ఆకాష్ పూరీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
బాల నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించి ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తున్నాడు.నిజానికి రొమాంటిక్ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకుంది కానీ కరోనా కారణంగా ఈ సినిమా విడుదల కాలేక పోయింది.
ఇక ఎట్టకేలకు వచ్చే వారం థియేటర్స్ లోకి తీసుకు రావాలని చుస్తున్నారు.అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈ సినిమా విడుదల చేయాలనీ అనుకున్నారు కాబట్టి ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది చిత్ర యూనిట్.ఈ క్రమంలోనే ఈ రోజు ఈ సినిమా నుండి ట్రైలర్ ను విడుదల చేసింది.
ఈ ట్రైలర్ ను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా విడుదల చేసాడు.
ఈ ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.
టైటిల్ కు తగ్గట్టుగానే ఈ సినిమా ట్రైలర్ ఫుల్ రొమాంటిక్ గా ఉంది.ఈ ట్రైలర్ ఆద్యంతం అభిమానులను అలరిస్తుంది.
ఈ ట్రైలర్ లో పూరీ మార్క్ కనిపిస్తుంది.హీరోను చాలా రఫ్ గా రొమాంటిక్ యాంగిల్ లో చూపించారు.
ఈ సినిమాకు పురీ జగన్నాథ్ కథ, స్కరీ ప్లే అందిస్తుండడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
పూరీ తన సూపర్ హిట్ లవ్ స్టోరీలు ఎలా ఆకట్టుకున్నాయి ఈ సినిమా కూడా ప్రేక్షకులను అలరిస్తుందని టీమ్ అంత నమ్ముతుంది.
ఇక ఈ సినిమాలో రమ్య కృష్ణ చాలా ప్రత్యేకమైన పాత్రలో కనిపిస్తుంది.ఈ ట్రైలర్ ను బట్టి చుస్తే ఒక పోకిరి తన ప్రేమను పొందేందుకు ఎన్ని ప్రయత్నాలు అయినా చేయడం దానిని దక్కించుకోవడం ఇదే కథగా కనిపిస్తుంది.
ఇక ఈ సినిమాలో కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది.
ఇక వీరిద్దరి రొమాన్స్ కూడా ఈ సినిమాకు ప్లస్ అవుతుందనే చెప్పాలి.ఈ సినిమా అనిల్ పాడూరి దర్శకత్వంలో తెరకెక్కుతుంది.ఈ ట్రైలర్ ప్రభాస్ చేతుల మీదుగా విడుదల అవ్వడంతో ఈ సినిమా జనాల్లోకి మరింతగా వెళ్ళింది.
వచ్చే వారం 29న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంత మేరకు అలరిస్తుందో వేచి చూడాల్సిందే.