యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం టాలీవుడ్ తిమింగలం అని చెప్పుకోవచ్చు.టాలీవుడ్ స్టార్ హీరోలను సైతం పక్కకు నెట్టేసి బాహుబలి, సాహో చిత్రాలతో ఆల్ ఇండియా రేంజ్ స్టార్ అయ్యాడు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అతి పెద్ద చేప అదే తిమింగలం మాదిరిగా మారిపోయాడు.తెలుగు స్టార్ నిర్మాతలు దర్శకులు ఈయనకు వల వేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈయన కోసం బాలీవుడ్ నుండి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
బాహుబలి మొదటి పార్ట్ విడుదల అయిన సమయంలోనే కరణ్ జోహార్ ఈయనతో సినిమాను నిర్మించేందుకు ఆసక్తి చూపించాడు.
అప్పుడే అడ్వాన్స్ కూడా ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు.కాని అప్పటికే తాను చేసుకున్న కమిట్మెంట్స్ను కాదని కరణ్ జోహార్కు డేట్లు ఇవ్వలేక పోయాడు.
అయితే ఎంతైనా తనకు బాలీవుడ్లో అంతటి గుర్తింపు తెచ్చి పెట్టిన నిర్మాత అవ్వడంతో కరణ్ జోహార్కు ఓకే చెప్పాడు.
ప్రభాస్ తన 22వ చిత్రంను కరణ్ జోహార్ నిర్మాణంలో చేయబోతున్నాడు.అయితే తెలుగులో ప్రముఖ నిర్మాత పేరు ఉంటేనే బిజినెస్ అయ్యే అవకాశం ఉంది.అందుకే అదే సినిమాకు అల్లు అరవింద్ కూడా నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు.
గత కొంత కాలంగా ప్రభాస్తో సినిమా కోసం అల్లు అరవింద్ ప్రయత్నాలు చేస్తున్నాడు.ఎట్టకేలకు కరణ్ జోహార్తో కలిసి ప్రభాస్ సినిమాను నిర్మించే అవకాశం వచ్చింది.
ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలు ఒక కొలిక్కి వచ్చిన తర్వాత ఈ మూవీని పట్టాలెక్కించే అవకాశం ఉంది.