యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ సినిమా షూటింగ్ మొన్నటి వరకు హైదరాబాద్ లో జరిగింది.ప్రభాస్ మరియు శృతి హాసన్ లు ఇంకా కీలక నటీ నటులు ఈ సినిమా చిత్రీకరణ లో పాల్గొన్నారు.
భారీ అంచనాలున్న ఈ సినిమా చిత్రీకరణ తాజా షెడ్యూల్ ముగిసిన వెంటనే ప్రభాస్ ఒక్క రోజు గ్యాప్ తో వెంటనే ముంబయి వెళ్లి పోయాడు.అక్కడ చిత్రీకరణ కోసం వెళ్లిన ప్రభాస్ ఆదిపురుష్ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు అనే వార్తలు వస్తున్నాయి.
ఓమ్ రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ కోసం కృతి సనన్ తో కలిసి ప్రభాస్ నటిస్తున్నాడు.
రామాయణం ఇతివృత్తంతో కొనసాగుతున్న ఈ సినిమా కు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు చాలా జోరుగా సాగుతున్నాయి.
షూటింగ్ కార్యక్రమాల హడావుడి పూర్తి చేసేందుకు గాను ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్ ను టార్గెట్ గా పెట్టుకున్నారు.వరుసగా చేస్తున్న సినిమా వల్ల ఈ సినిమా తో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను దక్కించుకునేందుకు ప్రభాస్ సిద్దంగా ఉన్నాడు.
వచ్చే ఏడాది సంక్రాంతికి గాను రాధే శ్యామ్ సినిమా ను ప్రభాస్ విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే.
అది మాత్రమే కాకుండా వచ్చే ఏడాది లో అన్ని సవ్యంగా సాగితే సలార్ మరియు ఆదిపురుష్ లు సమ్మర్ మరియు ఆగస్టుల్లో విడుదల కాబోతున్నాయి.ఈ విషయంలో ప్రభాస్ అభిమానులు చాలా ఆసక్తిగా ఉన్నారు.అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఈ సినిమాలు వేల కోట్ల వసూళ్లను నిర్మాతలకు అందించబోతున్నాయి.
ప్రభాస్ ఏమాత్రం బ్రేక్ తీసుకోకుండా వరుసగా సినిమాలను చేస్తున్న నేపథ్యంలో అభిమానులు ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు.