తెలుగులో ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నారు.అయితే నిజమైన హీరోలు మాత్రం కొందరు అనడంలో సందేహం లేదు.
సినిమాల్లో మాదిరిగా నిజ జీవితంలో కూడా నలుగురికి సాయం చేసే వారిని నిజమైన హీరోలు అంటారు.అందులో ఎలాంటి సందేహం లేదు.
తెలుగులో ఎంతో మంది హీరోలు పేదవారికి సాయం చేస్తూ ఉంటారు.అయితే ప్రభాస్ సాయం మాత్రం చాలా భారీగా ఉంటుంది అనడంలో సందేహం లేదు.
ప్రభాస్ కరోనా టైం లో ఏకంగా నాలుగు కోట్ల సాయంను ప్రకటించాడు.ఇక ఏకంగా ఒక అడవిని దత్తత తీసుకుని ఆ అడవి బాగోగులు చూడటం చేస్తున్నాడు.
ఇలా ఎన్నో మంచి పనులను ఆయన చేస్తున్నాడు.ఇలాంటి సమయంలో ప్రభాస్ మంచి తనం మరియు మానవత్వం గురించి మరోసారి మాట్లాడుకునే సందర్బం వచ్చింది.
ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్ షూటింగ్ ఇటలీలో జరుగుతుంది.ఇటలీలో చిత్రీకరణ కోసం వెళ్లిన యూనిట్ సభ్యులు అందరి కూడా కరోనా కారణంగా అత్యంత జాగ్రత్తల మద్య ఫైవ్ స్టార్ హోటల్ల్లో ఉంటున్నారు.
సాదారణంగా అయితే హీరో మరియు కీలక యూనిట్ సభ్యులు మాత్రమే ఫైవ్ స్టార్ హోటల్లో ఉంటారు.కాని కరోనా భయం కారణంగా ప్రతి ఒక్కిరికి కూడా ఫైవ్ స్టార్ హోటల్లో బస ఏర్పాటు చేయాల్సిందిగా నిర్మాతలకు ప్రభాస్ చూచించాడట.
అందరికి ఒకే స్థాయి రూంలు మరియు ఏర్పాట్లు కల్పించడం అనేది ఆర్థికంగా చాలా ఎక్కువ భారంను కలిగిస్తుంది.అయినా కూడా తప్పదు అంటూ ప్రభాస్ తన యూనిట్ సభ్యులందరికి కూడా సూట్ రూంలో ఇప్పించి వీఐపీ ట్రీట్మెంట్ను అక్కడ ఇప్పిస్తున్నాడట.
ఇంత మంచి హీరో తెలుగు వాడు అవ్వడం మన అదృష్టం అంటూ ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.రాధేశ్యామ్ మూవీ షూటింగ్ ఇటలీలో వచ్చే నెల మూడవ వారం వరకు ఇటలీలోనే చిత్రీకరణ జరుపుకోనుంది.
ఆతర్వాత ఇండియాకు వచ్చేస్తారు.