ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిన తర్వాత కొంచెం కూడా తీరిక లేకుండా వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంటున్నాడు.ప్రెసెంట్ ప్రభాస్ చేతిలో నాలుగు పాన్ ఇండియా మూవీలు ఉన్నాయి.
అందులో ఒకటి ఆదిపురుష్ అయితే మరొకటి సలార్ సినిమా.ఈ రెండు కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి.
రెండు వేటికవే డిఫరెంట్ సినిమాలు కావడంతో ఈ సినిమాలు కోసం ప్రభాస్ చాలా కష్టపడుతున్నాడు
ఈ రెండు సినిమాల్లో ప్రభాస్ రెండు విభిన్న లుక్స్ తో నటించాల్సి ఉంది.అందుకే ప్రభాస్ ఈ సినిమాల కోసం తన లుక్ ను మార్చేస్తున్నారు.
సలార్ సినిమాను కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్నాడు.హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాగా నీల్ తెరకెక్కిస్తున్నాడు.
ఇక ఈ మధ్యనే రామోజీ ఫిలిం సిటీలో హై వోల్టేజ్ ఇంటర్వెల్ బ్లాక్ ను తెరకెక్కించారు.
ఇక ఇప్పుడు ప్రభాస్ మరొక భారీ యాక్షన్ సన్నివేశానికి రెడీ అవుతున్నాడట.సలార్ సినిమా షెడ్యూల్ పూర్తి చేసుకున్న ప్రభాస్ మళ్ళీ ఆదిపురుష్ షూటింగ్ లో జాయిన్ కాబోతున్నాడని తెలుస్తుంది.ఆదిపురుష్ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్నాడు.
రామాయణం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఇక ఈ సినిమాలో భారీ యుద్ధ పోరాట సన్నివేశం కోసం ప్రభాస్ తనని తాను సన్నద్ధం చేసుకుంటున్నాడట.
త్వరలోనే ఈ సినిమా షెడ్యూల్ స్టార్ట్ అవ్వబోతుంది.ఇక ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటిస్తున్నారు.సన్నీ సింగ్ లక్ష్మణ పాత్రలో నటిస్తున్నాడు.ఈ సినిమాను టి సిరీస్ సంస్థ 500 కోట్ల బడ్జెట్ తో భారీగా నిర్మిస్తున్నారు.ఈ సినిమాను త్వరగా పూర్తి చేసి నెక్స్ట్ ఇయర్ ఆగష్టు లో రిలీజ్ చెయ్యాలని చిత్ర యూనిట్ భావిస్తుంది.