ఇండియన్ వైడ్ మోస్ట్ పాపులర్ హీరోగా ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇమేజ్ ఆకాశం అంత ఎత్తులో ఉంది.ప్రస్తుతం అతని చేతిలో ఏకంగా ఐదు పాన్ ఇండియా మూవీలు ఉన్నాయి.
అన్ని కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతూ ప్రభాస్ రేంజ్ ని మరింత పెంచే కథలే కావడం విశేషం.పీరియాడిక్ లవ్ స్టొరీగా తెరకెక్కిన రాధేశ్యామ్ సినిమా కంప్లీట్ అయ్యి రిలీజ్ స్టేజ్ లో ఉండగా మరో వైపు రామాయణం బేస్ తో తెరకెక్కుతున్న ఆది పురుష్ మూవీ షూటింగ్ జరుగుతుంది.
ఇక నాగ్ అశ్విన్ ఫిక్షన్ మూవీ కూడా జులై, ఆగష్టులో లేదంటే ఈ ఏడాది ఆఖరులో సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది.ఈ మధ్యలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మాఫియా బ్యాక్ డ్రాప్ కథాంశం అయిన సలార్ మూవీని కూడా కంప్లీట్ చేయనున్నాడు.
వీటి తర్వాత సిద్దార్ద్ ఆనంద్ దర్శకత్వంలో యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఓ బాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా లైన్ లో పెట్టాడు.ఈ సినిమాలు అన్ని కూడా అతనికి యూనివర్శల్ అప్పీల్ తీసుకురాబోతున్నాయి.
ఇదిలా ఉంటే ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు బి-టౌన్ లో ప్రభాస్ గురించి ఓ క్రేజీ న్యూస్ ట్రెండ్ అవుతుంది. టామ్ క్రూజ్ మిషన్ ఇంపాజిబుల్ 7లో ప్రభాస్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు అనే వార్త ప్రచారంలోకి వచ్చింది.
ఇప్పటికే ఈ మూవీ దర్శకుడు క్రిస్టోఫర్ మెక్ క్యారీ ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నట్లు టాక్ వినిపిస్తుంది.రాధేశ్యామ్ షూటింగ్ ఇటలీలో జరుగుతున్న సమయంలోనే దర్శకుడు ప్రభాస్ ని కలిసి కథ వినిపించడం జరిగిందని, ప్రభాస్ కూడా స్క్రిప్ట్ నచ్చి వెంటనే ఒకే చెప్పాడని టాక్ వినిపిస్తుంది.
ఇక ఇటలీలోనే మిషన్ ఇంపాజిబుల్ కి సంబందించిన కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ లో ప్రభాస్ తో కంప్లీట్ చేసారని ప్రచారం జరుగుతుంది.వచ్చే ఏడాది మే 27న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.
అందులో నిజంగానే ప్రభాస్ సర్ప్రైజ్ ఉంటుందేమో అనేది చూడాలి.