దేశంలో కరోనా సెకండ్ వేవ్ పడగవిప్పిన పాములాగా విజృంభిస్తోంది.నిమిషానికి 200 పాజిటివ్ కేసులు బయట పడుతున్నాయి.
దాదాపు మూడు లక్షల దగ్గరలో కొత్త కేసులు రోజు నమోదు అవుతున్నాయి.దీంతో దేశంలో చాలా హాస్పిటల్స్ లో బెడ్లు, ఆక్సిజన్ దొరకని పరిస్థితి ఏర్పడింది.
ఇలాంటి తరుణంలో వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం కేంద్రం చాలా శరవేగంగా చేస్తుంది.పరిస్థితి ఇలా ఉండగా దేశంలో చాలామంది సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్న సంగతి తెలిసిందే.
టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలు పవన్ కళ్యాణ్ ఇటీవల కరోనా బారిన పడి మూడు రోజులకే కోలుకోవటం జరిగింది.ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్ మేకప్ మాన్ కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.
దీంతో ప్రభాస్ సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు.ఒక్క ప్రభాస్ మాత్రమే కాక రాధేశ్యాంసినిమా యూనిట్ మొత్తం ప్రస్తుత షెడ్యూల్ క్యాన్సిల్ చేసుకుని ఐసోలేషన్ లోకి వెళ్ళిపోయింది.
రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.జులై 30వ తారీఖున ఈ సినిమా రిలీజ్ కానుంది.
ఈ వార్త సోషల్ మీడియాలో రావటంతో ప్రభాస్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు.