టాలీవుడ్ లో ఆరడుగుల అందగాడు ఎవరు అనగానే మనకు ముందుగా ఎవరు గుర్తుకు వస్తారు? ఇంకెవరు మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అనే చెప్పాలి.బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుని ఏ హీరోకు లేనంతగా స్టార్ డమ్ తెచ్చుకున్నాడు.
ఇక బాలీవుడ్ లో ఆరడగుల అందగాడు అనగానే హృతిక్ రోషన్ అక్కడి ప్రేక్షకులను గుర్తుకు వస్తాడు.
ఇలా ఈ ఇద్దరు ఈ రెండు ఇండస్ట్రీ లలో బాగా ఫేమస్ అయ్యారు.
మరి అలాంటి స్టార్ డమ్ అందుకున్న ఈ ఇద్దరు కలిసి సినిమాలు చేస్తే ఎలా ఉంటుంది.బొమ్మ బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే.మరి ఇలాంటి కాంబోను సెట్ చేసే పనిలో మేకర్స్ ఉన్నట్టు తెలుస్తుంది.అది కూడా మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించేందుకు ప్రణాళికలు చేస్తున్నట్టు తెలుస్తుంది.
ఇటీవలే వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రభాస్ తో ఒక సినిమా చేయాలని బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ ను కోరినట్టు తెలుస్తుంది.అందుకు ఈ డైరెక్టర్ కూడా ఒప్పుకున్నట్టు తెలుస్తుంది.ఇప్పటికే అడ్వాన్స్ కూడా ఇచ్చినట్టు టాక్.పఠాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు సిద్ధార్థ్ ఆనంద్.
మరి ఈ సినిమా విజయం అవుతుంది అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఈ సినిమా తర్వాత సిద్ధార్థ్ ఆనంద్ హృతిక్ రోషన్ తో ఫైటర్ అనే సినిమా చేస్తున్నాడు.హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ ను ఒక అతిధి పాత్ర కోసం తీసుకోవాలి అని సిద్ధార్థ్ ఆనంద్ అనుకుంటున్నారు అని ప్రభాస్ కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అని టాక్ వస్తుంది.ఇదే నిజమైతే రికార్డులు గల్లంతే అంటున్నారు ఫ్యాన్స్.
తాజా వార్తలు