యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బహుబలి చిత్రం తరువాత అటుపక్క తెలుగు సినిమా రేంజ్ తో పాటు ప్రభాస్ రేంజ్ కూడా ఒక్కసారిగా మారిపోయింది.ఇటు సౌత్ తో పాటు నార్త్ లో కూడా ప్రభాస్ కు విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడిపోయింది.
అయితే బాహుబలి వంటి సూపర్ హిట్ ని అందుకున్న ప్రభాస్ తదుపరి చిత్రం ‘సాహో’ పై కూడా అందరూ చాలానే ఆశలు పెట్టుకున్నారు.బాహుబలి రేంజ్ లో ఈ చిత్రం ఉంటుంది అని, ఈ చిత్ర మేకింగ్ కోసం కోట్లలో ఖర్చు పెట్టడం తో అందరూ అలానే భావించారు.
కానీ తెలుగులో మాత్రం పెద్దగా ఆడకపోయినప్పటికీ హిందీ లో మాత్రం అద్భుత విజయాన్ని అందుకుంది.
దీనితో నార్త్ లో ప్రభాస్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగింది.అంతేకాకుండా బాలీవుడ్ లో సినిమాలు చేయాలి అంటూ పెద్ద పెద్ద బాలీవుడ్ నిర్మాతలు క్యూలు కడుతున్నారు.తాజాగా కరణ్ జోహార్, ఆదిత్య చోప్రా వంటి ప్రముఖ నిర్మాతలు అదిరిపోఏ డీల్స్ ను ప్రభాస్ ముందు ఉంచారట.
అయితే మామూలుగా ఎవరైనా స్టార్స్ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని చూస్తారు.కానీ ఈ యంగ్ రెబల్ స్టార్ మాత్రం తనకు వచ్చిన ఆఫర్స్ అన్నిటికి కూడా నో చెప్పినట్లు తెలుస్తుంది.
వాటిల్లో ధూమ్-4 ఉందట.గతంలో ధూమ్-4 లో నటించమని ఆఫర్ వస్తే ప్రభాస్ నో చెప్పాడు.
అయితే ఇటీవల వచ్చిన ‘వార్’ మూవీ హిట్ కొట్టడం తో ఇప్పుడు దానికి సీక్వెల్ చేయాలన్న ఆలోచనలో ఆదిత్య చోప్రా ఉన్నట్లు తెలుస్తుంది.ఈ నేపథ్యంలో ఆదిత్య చోప్రా మరోసారి ప్రభాస్ కు ఈ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది.‘వార్’ సీక్వెల్ గానీ లేదంటే ధూమ్-4 లో గాని నటించడానికి ప్రభాస్ ఒప్పుకోవాలని కోరినట్లు తెలుస్తుంది.ప్రభాస్ లాంటి భారీ పర్సనాలిటీ అయితే ఈ చిత్రాలకి బాగుంటుంది, మంచి హిట్ వస్తుంది అని వారు భావిస్తున్నారు.
మరి ఈ సారైనా ఈ కుర్ర హీరో దానికి ఒకే చెబుతాడో లేదో చూడాలి.ఒకవేళ ఒకే చెబితే మాత్రం ప్రభాస్ కు బాలీవుడ్ లో అద్భుతమైన చిత్రంతో ఎంట్రీ ఇచ్చే అవకాశం లభించినట్లే అని చెప్పాలి.ఇప్పటివరకు ధూమ్ సీక్వెల్ లో వచ్చిన చిత్రాల్లో అన్నిటిలో కూడా ప్రతినాయకుల పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.అంటే ఒకవేళ ధూమ్-4 కు ప్రభాస్ ఒకే చెబితే విలన్ గానే బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అన్నమాట.