విదేశాల నుంచి షూటింగ్ పూర్తి చేసుకొని ఇండియా వచ్చిన సెలబ్రిటీలు హోం క్వారంటైన్ లో ఉండాలని ప్రభుత్వం సూచించడంతో ఇప్పుడు అదే పని అందరూ చేస్తున్నారు.ఇప్పటికే బాలీవుడ్ సెలబ్రిటీ కనికా కపూర్ హౌస్ అరెస్ట్ కాకుండా కరోనా పోజిటివ్ వచ్చిన విషయం దాచి పెట్టి పార్టీలు, పెళ్ళిళ్ళకి వెళ్లి అందరికి అంటించింది అని ఆమె మీద విమర్శలు చేస్తున్నారు.
ఈ నేపధ్యంలో చాలా మంది సెలబ్రిటీలు ఇప్పటికే జాగ్రత్త పడ్డారు.వారిలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఉన్నారు.
జార్జీయా నుంచి షూటింగ్ పూర్తి చేసుకొని ఇండియా వచ్చిన ప్రభాస్ హోం క్వారంటైన్ తీసుకుంటున్నాడు.ఈ విషయాన్నీ ట్విట్టర్ ద్వారా ఫాన్స్ తో పంచుకున్నారు.
ఫారెన్లో చిత్రీకరణ తర్వాత సురక్షితంగా ఇంటికి తిరిగొచ్చాను.ప్రపంచ వ్యాప్తంగా కరోనా భూతం పొంచి ఉన్న కారణంగా తనను తాను ఇంట్లో నిర్భంధించుకున్నట్టు తెలిపారు.ప్రతి ఒక్కరు కరోనా బారిన పడకుండా తమకు తాము సురక్షితంగా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.ఇక ప్రభాస్ ఇలా హోం క్వారంటైన్ తీసుకోవడంపై రెబల్ స్టార్ ఫాన్స్ అందరూ సంబరపడిపోతున్నారు.
మా హీరో ప్రతి దాంతో అందరికి ఆడర్శకంగా ఉంటాడని చెప్పుకుంటున్నారు.ఇక హీరోలు అందరూ ప్రభాస్ ని చూసి నేర్చుకోవాలని ఉచిత సలహాలు కూడా ఇచ్చేస్తున్నారు.