ఆదిపురుష్( Adipurush ).ఈ సినిమా ప్రస్తుతం పాన్ ఇండియా రేసులో మోస్ట్ అవైటెడ్ సినిమా అనే చెప్పాలి.
ఇక ఈ సినిమాకు ఎదురు నిలిచే సాహసం కానీ ధైర్యం కానీ ఎవ్వరు చేయరు.అందుకే ఆదిపురుష్ సినిమాతో ప్రభాస్ సింహం సింగిల్ గా వస్తుంది అన్నట్టు మరోసారి సింగిల్ గా రిలీజ్ చేస్తున్నాడు.
ఇతిహాస గ్రంధం రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్( Prabhas ) రాముడిగా నటించగా కృతి సనన్ సీత పాత్రలో నటించింది.
ఇక బాలీవుడ్ స్టార్ హీరో లంకేశ్వరుడు( Lankeshwarudu ) రావణాసురుడిగా నటించాడు.
ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్( Om Raut ) తెరకెక్కించిన ఈ మాసివ్ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు వెండితెర పై చూస్తామా అని ఆడియెన్స్ మాత్రమే కాదు సినీ ప్రముఖులు సైతం ఎదురు చూస్తున్నారు.
ముందు నుండి నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్న ఈ సినిమా రిజల్ట్ పై కూడా చాలా మందికి క్యూరియాసిటీ గా ఉంది.
ఇదిలా ఉండగా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో మొన్ననే గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి భారీ అంచనాలను పెంచేసిన ఆదిపురుష్ మేకర్స్ ఈ ఈవెంట్ తర్వాత తెలుగులో ఎలాంటి ప్రమోషన్స్ చేసేలా కనిపిస్తున్నారు.అందులోను ప్రభాస్ కు విదేశాల్లో జరిగే ఆదిపురుష్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లినట్టు తెలుస్తుంది.అందుకే రిలీజ్ వరకు ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు ఉండే అవకాశం లేదు.
అత్యంత భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసిన తర్వాత ఇక్కడ ప్రమోషన్స్ చేయడానికి కూడా పెద్దగా ఏమీ లేదు.మహా అంటే రెండు మూడు ఇంటర్వ్యూలు చేస్తే తప్ప.అలాంటివి ఇప్పటికే చేసి ఉంటే వారిని రిలీజ్ చేసే అవకాశం కూడా ఉంది.దేశ వ్యాప్తంగా ఇప్పటికే భారీ అంచనాల మధ్య భారీ స్థాయిలో రిలీజ్ అయ్యేందుకు అన్ని సన్నాహాలు జరిగాయి.
అందుకే ప్రభాస్ అండ్ టీమ్ విదేశాల ప్రమోషన్స్ పై ద్రుష్టి పెట్టినట్టు తెలుస్తుంది.