ఇండియన్ హీరోగా మారిపోయిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాని కరెక్ట్ గా మార్కెట్ చేసుకుంటే రిలీజ్ కి ముందే రెండు వందల నుంచి మూడు వందల కోట్ల బిజినెస్ చేసుకోవచ్చు.ఇప్పుడు సౌత్ ఇండియా నుంచి భారీ స్థాయిలో మార్కెట్ ఉన్న హీరోగా ప్రభాస్ తన స్టామినా చూపిస్తున్నాడు.
సాహో సినిమా కూడా రిలీజ్ కి ముందే మూడు వందల కోట్లకి పైగా బిజినెస్ అయిపొయింది.ఇక రిలీజ్ తర్వాత ఎవరేజ్ టాక్ తెచ్చుకున్న భారీ కలెక్షన్స్ సొంతం చేసుకుంది.
ఈ నేపధ్యంలో ప్రభాస్ తో సినిమా అంటే నిర్మాతలుగా వంద నుంచి రెండు వందల కోట్ల వరకు పెట్టుబడి పెట్టడానికి రెడీ అయిపోతున్నారు.ఇప్పుడు బడా నిర్మాత అశ్వినీదత్ కూడా ప్రభాస్ తో ఆ స్థాయిలోనే తన అల్లుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా ప్లాన్ చేస్తున్నాడు.
ప్రభాస్ తో సినిమా అంటే అది పాన్ ఇండియా మూవీగానే వస్తుంది.ఇక నాగ్ అశ్విన్ కూడా ఒక పాంటసీ జానపథ కథని ప్రభాస్ తో తెరకెక్కించబోతున్నాడు.
ఇక ఈ సినిమా కోసం అశ్వినీదత్ ప్రభాస్ కి ఏకంగా 70 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తుంది.అలాగే ఈ సినిమాని ఏడాది లోపు పూర్తి చేయాలని దర్శకుడికి క్లారిటీగా చెప్పినట్లు కూడా తెలుస్తుంది.
రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా రిలీజ్ నాటికి నాగ్ అశ్విన్ పక్కాగా స్క్రిప్ట్ వర్క్ చేసుకొని ముందుగానే ప్లానింగ్ చేసుకుంటే ఏడాది లోపు సినిమా పూర్తి చేయొచ్చు.ఇక అశ్వినీదత్ ప్రభాస్ ఒక్కడికే 70 కోట్లు రెమ్యునరేషన్ ఇస్తూ ఉంటే మిగిలిన నటీనటులకి తక్కువలో 20 కోట్లు అయిన ప్రొడక్షన్ కాస్ట్ వంద కోట్ల వరకు అయిపోతుంది.
ఈ నేపధ్యంలో దీనికి 200 కోట్లు బడ్జెట్ ని నిర్మాత అశ్వినీదత్ సిద్ధం చేసుకున్నట్లే తెలుస్తుంది.మొత్తానికి తెలుగులో ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు తమ సినిమాలకి 50 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.
ఇక కొత్త సినిమాతో ప్రభాస్ వారిని క్రాస్ చేసినట్లు అర్ధమవుతుంది.