యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే.ఆయన బాహుబలి తో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారి పోయాడు.
ఇప్పుడు ప్రభాస్ ను ఆల్ ఇండియా సూపర్ స్టార్ అంటూ పిలుస్తున్నారు.అలాంటి ఆల్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ కు ఇసుమంతైనా ఈగో ఉండదు.
ఒక చిన్న పిల్లాడు మాదిరిగా వ్యవహరిస్తూ ఉంటాడు.మొత్తానికి ప్రభాస్ చాలా సింపుల్ అండ్ స్వీట్ అంటూ మరో సారి నిరూపితం అయ్యింది.
నిన్న ప్రభాస్ చేతుల మీదుగా రొమాంటిక్ సినిమా ట్రైలర్ లాంచ్ జరిగింది.ఆ వేదిక మీద పూరి జగన్నాద్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ప్రభాస్ స్వయంగా తాను సినిమా ను ప్రమోట్ చేస్తాను అంటూ పదే పదే అడిగాడు.అతడు యొక్క మంచి తనం అది అంటూ ఈ సందర్బంగా పూరి చెప్పుకొచ్చాడు.
ఒక సారి రొమాంటిక్ సినిమా పోస్టర్ ఒకటి ప్రభాస్ కు పంపించాను.విడుదలకు సిద్దం అవుతుందని చెప్పాను.అప్పుడు వెంటనే కాల్ చేసి నేను మనోడి సినిమాను ప్రమోట్ చేస్తాను.ఆ పోస్టర్ ను ఇన్ స్టా లో షేర్ చేయనా అని తనే అడిగాడు.
ప్రభాస్ నుండి ఆ కాల్ రావడంతో నేను ఆశ్చర్య పోయాను.అప్పడు ట్రైలర్ విడుదల చేద్దాం అన్నాను.
మళ్లీ రెండు రోజుల తర్వాత ప్రభాస్ కాల్ చేశాడు.ట్రైలర్ రిలీజ్ అన్నావ్ కదా ఎప్పుడు చేద్దాం.
మనోడి సినిమా ఖచ్చితంగా నేను ప్రమోట్ చేయాలంటూ ముందుకు వచ్చాడు.
అంతటి గొప్ప వ్యక్తి అంటూ ప్రభాస్ గురించి పూరి చెప్పుకొచ్చాడు.ఒక స్టార్ హీరోతో ట్రైలర్ విడుదల చేయించడం కోసం నిర్మాతలు నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు.అలాంటిది ప్రభాస్ స్వయంగా రెండు మూడు సార్లు కాల్ చేసి రొమాంటిక్ సినిమా ను నేను ప్రమోట్ చేస్తాను అంటూ చెప్పడం నిజంగా అభినందనీయం అంటూ ప్రతి ఒక్కరు అంటున్నారు.
ఇదే ఆయన తీరుకు సాక్ష్యం.పాన్ ఇండియా సూపర్ స్టార్ అయినా కూడా పూరి పై తనకు ఉన్న గౌరవంను ఏమాత్రం తగ్గించుకుండా రొమాంటిక్ ను ప్రమోట్ చేయడం ద్వారా నిరూపించాడు.
అందుకే ప్రభాస్ ది బెస్ట్ ఆల్ ఇండియా సూపర్ స్టార్ అంటూ అభిమానులు అంటూ ఉంటారు.