నేడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు.సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ప్రభాస్ బర్త్డే వేడుకలకు సంబంధించిన ఫొటోలు మరియు బర్త్డే విషెష్లు చెబుతూ పోస్ట్లు కనిపిస్తున్నాయి.
ప్రభాస్ పుట్టిన రోజు అంటే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇండియా వ్యాప్తంగా కూడా సందడి కొనసాగుతోంది.నేడు ఇండియా వ్యాప్తంగా కూడా సోషల్ మీడియాలో ప్రభాస్ బర్త్డే ట్రెండ్ కొనసాగుతున్నాయి.
ఇంత హడావుడి ఉన్నా కూడా ప్రభాస్ ఫ్యాన్స్ కొందరు నిరాశలో ఉన్నారు.
బాహుబలి, సాహో చిత్రాలతో ఆల్ ఇండియా సూపర్ స్టార్ అయిన ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో జాన్ అనే చిత్రాన్ని చేస్తున్నాడు.
ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే కొంత జరిగింది.త్వరలోనే కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతుంది.జాన్ సినిమాకు సంబంధించిన ఫస్ట్లుక్ను చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేయాలని ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకున్నారు.కాని పుట్టిన రోజున ప్రభాస్ ఫ్యాన్స్ను యూవీ క్రియేషన్స్ వారు తీవ్రంగా నిరుత్సాహపర్చారు.
జాన్ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండా నిరాశకు గురి చేశారు.
మామూలుగా అయితే ఒక హీరో పుట్టిన రోజు వచ్చినప్పుడు ఆ హీరో బర్త్డేకు ఖచ్చితంగా ఏదో ఒక ప్రత్యేకమైన బహుమానం ఇవ్వడం జరుగుతుంది.కాని ఇప్పుడు ప్రభాస్ బర్త్డేకు అలా జరగలేదని ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు.సోషల్ మీడియాలో ఏడుస్తున్నట్లుగా ఈమోజీలు పెట్టి తమ బాధను వ్యక్తం చేస్తున్నారు.
వచ్చే ఏడాది సమ్మర్లో జాన్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.సినిమాలో ప్రభాస్కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది.పీరియాడిక్ నేపథ్యంలో ప్రేమ కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది.