ప్రభాస్ 20వ చిత్రాన్ని రాధాకృష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న విషయం తెల్సిందే.సాహో చిత్రాన్ని నిర్మించిన యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను కూడా భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం సినిమా షూటింగ్ కరోనా కారణంగా ఆగిపోయిన విషయం తెల్సిందే. ప్రభాస్ మూవీ అప్డేట్ కోసం అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కొత్త సంవత్సరంకు, సంక్రాంతికి, ఉగాదికి అంటూ ప్రభాస్ 20 చిత్రం అప్డేట్ను వాయిదా వేస్తూ వచ్చారు.
యూవీ క్రియేషన్స్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభాస్ ఫ్యాన్స్ తాజాగా ట్విట్టర్ లో స్పందించారు.
సినిమా అప్డేట్ను చాలా ఆలస్యం చేస్తున్న యూవీ క్రియేషన్స్ బ్యానర్ను బ్యాన్ చేయాలంటూ ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చాడు.ట్విట్టర్లో బ్యాన్ యూవీ క్రియేషన్ అనే హ్యాష్ ట్యాగ్ వైరల్ అయ్యింది.
ట్విట్టర్లో దాదాపుగా అయిదు వేల ట్వీట్స్ బ్యాన్ యూవీ క్రియేషన్స్ అంటూ రావడంతో వెంటనే యూవీ క్రియేషన్స్ వారు అధికారికంగా స్పందించారు.
ప్రభాస్ 20వ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ తో పాటు మరిన్ని విషయాలను మీ కోసం రెడీగా ఉన్నాయి.అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో మేము అంతా కూడా పూర్తిగా పాజ్లో ఉన్నాం.ఏ పని చేయకుండా ఎక్కడి వాళ్లం అక్కడే ఉండిపోయాం.
కనుక ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేం.ప్రపంచం మొత్తం చావుతో పోరాడుతున్న ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఇంటికే పరిమితం అయ్యి సురక్షితంగా ఉండండి.
ఈ విపత్తు నుండి బయట పడ్డ తర్వాత తప్పకుండా ప్రభాస్ 20 అప్డేట్స్ ఇస్తామంటూ ప్రభాస్ ఫ్యాన్స్కు యూవీ క్రియేషన్స్ హామీ ఇచ్చింది.