2019 సంవత్సరంలో ప్రభాస్ హీరోగా సుజీత్ డైరెక్షన్ లో తెరకెక్కి విడుదలైన సాహో సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలవడంతో పాటు ప్రభాస్ లుక్స్ పై ప్రేక్షకుల నుంచి నెగిటివ్ కామెంట్లు వచ్చాయి.అయితే రాధేశ్యామ్ సినిమాలో మాత్రం ప్రభాస్ కొత్త లుక్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.
చాలా సంవత్సరాల తర్వాత ప్రభాస్ పూర్తిస్థాయి ప్రేమకథలో విక్రమాదిత్య అనే పాత్రలో రాధేశ్యామ్ మూవీలో నటిస్తున్నారు.
రాధేశ్యామ్ మూవీ ఈ ఏడాది జులై నెల 30వ తేదీన విడుదల కానుంది.
రాధేశ్యామ్ షూటింగ్ దాదాపుగా పూర్తి కాగా ప్రస్తుతం ప్రభాస్ సలార్ సినిమాతో పాటు ఆదిపురుష్ సినిమాలో కూడా నటిస్తున్నారు.బాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఓంరౌత్ డైరెక్షన్ లో ఆదిపురుష్ సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమాలో ప్రభాస్ రాముని పాత్రలో నటించనున్నారు.
అయితే ప్రభాస్ రాముని పాత్రకు తగిన విధంగా లుక్ ను మార్చుకోలేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ప్రభాస్ ఫిజిక్ లో మార్పులు చేసుకోవాలని కేర్ తీసుకోకపోతే రాముని పాత్రలో తేలిపోయే అవకాశాలు ఉంటాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ప్రభాస్ ఫేస్ లో మునుపటి గ్లో కనిపించడం లేదని ప్రభాస్ ఫ్యాన్స్ సైతం అభిప్రాయపడటం గమనార్హం.వరుసగా సినిమా షూటింగ్ లలో పాల్గొంటున్న నేపథ్యంలో ప్రభాస్ కు ఎక్కువ సమయం రెస్ట్ కూడా దొరకకపోవడం గమనార్హం.
మరి ఫ్యాన్స్ సూచనల మేరకు ప్రభాస్ ఇకపై అయినా లుక్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారో లేదో చూడాల్సి ఉంది.రాబోయే రెండు సంవత్సరాల్లో ప్రభాస్ నుంచి ఏకంగా నాలుగు సినిమాలు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.ప్రభాస్ తన సినీ కెరీర్ లో ఎప్పుడూ లేని విధంగా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండటం గమనార్హం.