యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగి పోయాడు.ఇక అప్పటి నుండి ప్రభాస్ ప్రతి కదలికను అందరు నిశితంగా గమనిస్తున్నారు.
ప్రభాస్ ఎప్పుడు ఏం సినిమా చేస్తున్నాడో.ఎక్కడ ఉన్నాడో అనే ప్రతి విషయాన్ని గమనిస్తున్నారు.
ప్రెసెంట్ ప్రభాస్ చేతిలో నాలుగు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లు ఉన్నాయి.
అన్ని కూడా వంద కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ సినిమాలే.
రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ సినిమా ఎప్పుడో స్టార్ట్ చేసాడు.కానీ కరోనా కారణంగా ఆలస్యం అవుతూ వస్తుంది.
ఇక ఎట్టకేలకు ఇప్పుడు పూర్తి చేసే పనిలో ఉన్నారు.ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా, ఇంకా ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమాలు కూడా సెట్స్ మీదనే ఉన్నాయి.
ఇక వీటితో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే కూడా షూటింగ్ జరుపుకోవడానికి సిద్ధం అవుతుంది.
ఇప్పటికే ప్రభాస్ లేకుండా ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేసాడు అశ్విన్.
ఇక ఇవన్నీ విడుదల కాకుండానే మరొక సినిమాను ఓకే చేసాడు.ప్రభాస్ తన 25వ సినిమాను అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగ దర్శకత్వంలో చేయబోతున్నాడు.ఇక ఈ సినిమా టైటిల్ ‘స్పిరిట్’ అని కూడా చెప్పారు.
ఇంత వరకు బాగానే ఉన్న అసలు ఇక్కడే కథ మారింది.ఈ సినిమా టైటిల్ స్పిరిట్ అనగానే అభిమానులు ఇదెక్కడి టైటిల్ అంటూ విస్తుపోతున్నారు.ఇది ప్రభాస్ రేంజ్ కు తగ్గట్టుగా లేదని ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటి వరకు బాహుబలి తర్వాత అనౌన్స్ చేసిన టైటిల్స్ అన్ని పవర్ ఫుల్ గా ఉన్నాయి.
టైటిల్ వినగానే ఈ సినిమాపై అంచనాలు పెంచేసేలా ఉన్నాయి.
అయితే ఇప్పుడు సందీప్ వంగ దర్శకత్వంలో సినిమాకు స్పిరిట్ అనగానే అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.ఈ టైటిల్ బాగానే ఉన్న ప్రభాస్ రేంజ్ కు తగ్గట్టుగా మాత్రం లేదని అభిమానులు కొంచెం ఫీల్ అవుతున్నారు.మరి ఈ సినిమా ముందు ముందు వచ్చే అప్డేట్ లతో ఆ లోటును తీరుస్తారో లేదో చూడాలి.