గడిచిన ఏడు సంవత్సరాల్లో టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి, బాహుబలి 2, సాహో సినిమాలు మాత్రమే విడుదలయ్యాయి.ప్రభాస్ నటిస్తున్న ఒక సినిమాకు మరో సినిమాకు భారీగా గ్యాప్ వస్తుండటంతో గత కొన్ని నెలల నుంచి ప్రభాస్ వేగంగా సినిమాల్లో నటించాలని ఫ్యాన్స్ కోరుతూ వచ్చారు.
ప్రభాస్ కూడా ఫ్యాన్స్ కోరిక మేరకు వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్టులను ప్లాన్ చేసుకుంటూ వచ్చే మూడేళ్లలో నాలుగు సినిమాలు విడుదలయ్యేలా కెరీర్ ను ప్లాన్ చేసుకున్నారు.
అయితే వివాదాలకు దూరంగా పాజిటివ్ హీరోగా పేరు తెచ్చుకున్న ప్రభాస్ సినిమాలకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఆ ఇబ్బందుల గురించి తెలిసి ప్రభాస్ ఫ్యాన్స్ మా హీరోకే ఎందుకీ కష్టాలు అని ఆవేదన చెందుతున్నారు.టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ సినిమా ఇప్పటికే దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకుంది.
ఈ ఏడాది సమ్మర్ లో సినిమా విడుదలవుతుందని ఫ్యాన్స్ భావించారు.
కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడం, ఇతర కారణాల వల్ల రాధేశ్యామ్ రిలీజ్ ఏకంగా జులై 30కు వాయిదా పడటం ఫ్యాన్స్ ను కంగారు పెడుతోంది.ఈ సినిమా బిజినెస్ కు సంబంధించిన వార్తలు కూడా ఫ్యాన్స్ ను కంగారు పెడుతున్నాయి.మరోవైపు ప్రస్తుతం సలార్ మూవీ షూటింగ్ లో ప్రభాస్ పాల్గొంటుండగా ఆ మూవీ షూటింగ్ కు సంబంధించిన లీకులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
మరోవైపు బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆదిపురుష్ సినిమా షూటింగ్ తొలిరోజే అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో సినిమా మోషన్ క్యాప్చర్ ఎక్విప్మెంట్ మొత్తం కాలిపోయింది.ప్రభాస్ నటిస్తున్న ప్రతి సినిమాకు ఏదో ఒక సమస్య వస్తూ ఉండటంతో ప్రభాస్ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.