ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా పట్టాలెక్కి రెండేళ్లకు పైగా పూర్తి అయ్యింది.సినిమాకు రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు.
భారీ అంచనాలున్న ఈ సినిమా షూటింగ్ ఇంకా సాగుతూనే ఉంది.ఈ సినిమా షూటింగ్ సాగతీత విషయం అభిమానులకు తీవ్రంగా కోపం తెప్పిస్తోంది.
యూవీ క్రియేషన్స్ వారు సినిమా ప్రారంభం అయ్యి ఏడాది దాటినా కూడా అప్ డేట్ ఇవ్వక పోవడంతో ఆమద్య ప్రభాస్ అభిమానులు బ్యాన్ యూవీ క్రియేషన్ అంటూ ప్రచారం చేసిన విషయం తెల్సిందే.యూవీ క్రియేషన్స్ వారు ఆ దెబ్బతో ప్రభాస్ లుక్ ను రివీల్ చేశారు.
ఆ తర్వాత కూడా అదే సాగతీత కనబర్చుతున్నారు.సినిమా షూటింగ్ అప్ డేట్ కాని టీజర్ లేదా ఇంకేదైనా అప్ డేట్ ఇవ్వకుండా సాగ తీయడం వల్ల ప్రభాస్ అభిమాను లకు మరో సారి కోపం వస్తుంది.
రాధే శ్యామ్ సినిమా జులై నెలలో విడుదల చేస్తారనే అధికారిక ప్రకటన వచ్చింది.కాని ఇప్పటి వరకు అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా మాత్రం అనిపించడం లేదు.
ఈ విషయంలో అభిమానులు తీవ్రం అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.యూవీ క్రియేషన్స్ వారు ఏం చేస్తున్నారు అంటూ ప్రభాస్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభాస్ ప్రస్తుతం ఆది పురుష్ మరియు సలార్ షూటింగ్ ల్లో జాయిన్ అవ్వ బోతున్నాడు.త్వరలోనే నాగ్ అశ్విన్ దర్శకత్వం లో రూపొందబోతున్న సినిమా షూటింగ్ కు కూడా జాయిన్ అవుతున్నారు.
కాని ఇప్పటి వరకు రాధే శ్యామ్ షూటింగ్ ను మాత్రం యూవీ వారు పూర్తి చేసుకోలేక పోయారు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.వెంటనే రాధే శ్యామ్ అప్ డేట్ ఇవ్వకుంటే మళ్లీ నెగటివ్ ట్రోలింగ్ మొదలు పెడతామంటూ హెచ్చరిస్తున్నారు.