రూటు మార్చిన ప్రభాస్.. కొత్తవారికే ఓటు!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీ అవుతోంది.కాగా ఈ సినిమాను దర్శకుడు రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.

 Prabhas Doing Movies With Young Talent, Prabhas, Saaho, Radhe Shyam, Prabhas 21,-TeluguStop.com

ఇక ఈ సినిమా పూర్తి కాకముందే తన నెక్ట్స్ చిత్రాన్ని మహానటి చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు.

అయితే ప్రభాస్ ఎంచుకుంటున్న సినిమాలను చూస్తుంటే, గతకొంత కాలంగా ఆయన తన రూటు మార్చుకున్నట్లు స్పష్టం అవుతోంది.

గతంలో కేవలం స్టార్ డైరెక్టర్లతోనే సినిమాలు చేసిన ప్రభాస్ బాహుబలి చిత్రం తరువాత తన ఎంపికలో మార్పు చూపుతూ వస్తున్నాడు.సాహో చిత్రంతో సుజీత్ లాంటి యంగ్ డైరెక్టర్‌కు ఛాన్స్ ఇచ్చిన ప్రభాస్, ఆ తరువాత రాధేశ్యమ్ కోసం రాధాకృష్ణకు అవకాశం ఇచ్చాడు.

ఇక ఇప్పుడు నాగ్ అశ్విన్‌తో తన నెక్ట్స్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.దీంతో పాటు కేజీఎఫ్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్‌తోనూ ప్రభాస్ ఓ సినిమా చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

ఇలా వరుసగా వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించే దర్శకులతో ప్రభాస్ సినిమాలు చేస్తుండటంతో స్టార్ డైరెక్టర్లను ఆయన పక్కనబెట్టాడని, ట్యాలెంట్ ఉన్న డైరెక్టర్లకు పెద్దపీట వేస్తున్నాడనే విషయంలో ఎలాంటి సందేహం లేదని తెలుస్తోంది.ప్రభాస్ ఈ విధంగా దూసుకుపోతుండటంతో ఆయన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక రాధేశ్యామ్ చిత్ర షూటింగ్‌ను వీలైనంత త్వరగా తిరిగి ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.ఈ సినిమాలో అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube