పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం ఆదిపురుష్ మరియు సలార్ సినిమాల చిత్రీకరణ జరుపుతున్నారు.మొన్నటి వరకు రాధే శ్యామ్ చిత్రీకరణ లో పాల్గొన్న ప్రభాస్ ఇటీవలే ఆ సినిమా ను ముగించాడు.
ప్రస్తుతం ఆదిపురుష్ మరియు సలార్ లను షిప్ట్ ల వారిగా షూటింగ్ చేస్తున్నాడు.మొన్నటి వరకు ఆదిపురుష్ కోసం ముంబయిలో వేసిన గ్రీన్ మ్యాట్ లో షూటింగ్ లో పాల్గొన్నాడు.
నేటి నుండి సలార్ కోసం భారీ యాక్షన్ సన్నివేశంలో పాల్గొంటున్నాడు.మొత్తానికి రెండు సినిమాల మద్య కనీసం రెండు రోజుల గ్యాప్ ను కూడా ప్రభాస్ మెయింటెన్ చేయడం లేదు.
రెండు సినిమాల చిత్రీకరణ ను ఈ ఏడాదిలోనే ముగించాలని ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.భారీ అంచనాలున్న ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాదిలో వస్తాయనే నమ్మకంతో అంతా వెయిట్ చేస్తున్నారు.
ఆదిపురుష్ ను వచ్చే ఏడాది ఆగస్టుకు అన్నారు.కాని షూటింగ్ ఆలస్యం అవ్వడం వల్ల పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆలస్యం అవుతాయి.
కనుక విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి.ఎంత వాయిదా పడ్డ 2022 లోనే విడుదల చేయాలని అంతా కోరుకుంటున్నారు.
ప్రశాంత్ నీల్ ఖచ్చితంగా సలార్ సినిమా ను 2022 లోనే విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నాడు.భారీ అంచనాలున్న ఈ సినిమా లతో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా కూడా ఉంటుంది.
అది ఇప్పటికే ప్రారంభం అయ్యింది.
బచ్చన్ సాబ్ పై కీలక సన్నివేశాలను వారం రోజుల షెడ్యూల్ లో చేశారు.ప్రభాస్ ఇంకా జాయిన్ అవ్వాల్సి ఉంది.భారీ ఎత్తున అంచనాలున్న ప్రాజెక్ట్ కే సినిమా ను కూడా 2023 లోనే విడుదల చేస్తారనే నమ్మకం వ్యక్తం అవుతోంది.
గ్యాప్ లేకుండా సినిమా లను చేస్తున్న ప్రభాస్ అభిమానుల అంచనాలను అందుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.ఈ ఏడాదిలో రాధే శ్యామ్ విడుదల చేయాలనుకున్నా కూడా థియేటర్ల పరిస్థితి కారణంగా వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా వేసిన విషయం తెల్సిందే.