అనేక పుకార్లు ప్రచారాల మద్య ప్రభాస్ 21వ చిత్రం హీరోయిన్ దీపిక పదుకునే అంటూ తేలిపోయింది.ప్రతి రాజుకు ఒక రాణి కావాలి కదా మా రాజుకు దీపిక పదుకునే జోడీ అంటూ దర్శకుడు నాగ్ అశ్విన్ అధికారికంగా ప్రకటించాడు.
ఈ ప్రతిష్టాత్మక చిత్రం స్థాయిని మరింతగా పెంచిన దర్శకుడు నాగ్ అశ్విన్ ఇందుకోసం చాలా చర్చలు సంప్రదింపులు జరపడటంతో పాటు పారితోషికం విషయంలో ఆమెను ఆకాశానికి తీసుకు వెళ్లినట్లుగా ప్రచారం జరుగుతోంది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం దాదాపుగా రెండు నెలల పాటు దీపిక పదుకునే పారితోషికం విషయమై చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది.
బాలీవుడ్లో టాప్ మోస్ట్ హీరోయిన్ అవ్వడం వల్ల ఆమె భారీగా డిమాండ్ చేసింది.ఇదే సమయంలో ఆమెకు సౌత్లో నటించేందుకు ఆసక్తి లేకపోయినా కూడా ప్రభాస్ కారణంగా నటించేందుకు ముందుకు వచ్చింది.
ఇందుకు గాను అన్ని ఖర్చులతో కలిపి దీపిక పదుకునేకు చిత్ర నిర్మాత అశ్వినీదత్ 20 కోట్ల రూపాయలు ఇవ్వబోతున్నాడట.సినిమా పూర్తి అయ్యేప్పటికి ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.
నాగ్ అశ్విన్ తన సినిమాలో దీపిక పదుకునే ఉండి తీరాల్సిందే అని పట్టుబటి ఆమె పారితోషికంను కూడా లెక్క చేయకుండా ఒప్పించాడు.అద్బుతమైన ఈ సినిమాకు ఆమె జత కలిస్తే మరింత అద్బుతంగా మారుతుంది అనేది అతడి అభిప్రాయం.ఇప్పటి వరకు సౌత్ హీరోతో నటించిన ఏ హీరోయిన్కు ఆ స్థాయి పారితోషికం ఇవ్వలేదు.ప్రభాస్ ఈ సినిమాతో మరో రికార్డును దక్కించుకున్నాడు.