టాలీవుడ్ హీరో ప్రభాస్ బాహుబలి తరువాత ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయాడు.ఇటు టాలీవుడ్,బాలీవుడ్ లలో కూడా ప్రభాస్ అంటే విపరీతమైన క్రేజ్ అనేది ఒక్కసారిగా పెరిగిపోయింది.
దీనికి కారణం ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన బాహుబలి చిత్రం.ఈ ఒక్క చిత్రం అటు టాలీవుడ్ రేంజ్ ని అలానే ప్రభాస్ రేంజ్ ని దర్శకుడు రాజమౌళి ఒక్కసారిగా పెంచేశారు.
ఈ మూవీ హిట్ తో దాదాపు బాలీవుడ్ టాలీవుడ్ పైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరించింది.అయితే బాహుబలి తరువాత మళ్లీ అంతటి క్రేజ్ సంపాదించేపనిలో పడ్డాడు డార్లింగ్ ప్రభాస్.
ఈ నేపథ్యంలోనే ఆయన తాజాగా నటించిన సాహో చిత్రం త్వరలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.అయితే ఈ చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న డార్లింగ్ ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఒక హిందీ టెలివిజన్ ఛానెల్ రియాలిటీ డాన్స్ షో అయిన నచ్ బలియే లో గెస్ట్ గా హాజరయ్యారు.
ఈ షో కి ప్రభాస్ తో పాటు సాహూ హీరోయిన్ శ్రద్ధా కపూర్ కూడా హాజరైంది.అయితే ఈ షోలో పాల్గొన్న ప్రభాస్ చాలా హుషారుగా కనిపించాడు.ఈ షో పుణ్యమా అని తన చిరకాల కోరిక ను కూడా ప్రభాస్ తీర్చేసుకున్నాడు.ఇంతకీ ఆ కోరిక ఏమిటంటే బాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్ టిప్ టిప్ బర్సా పానీ పాటకు డ్యాన్స్ చేయాలనట.
దీనితో ఆ షో జడ్జి అయిన రవీనా టాండన్ తో కలిసి స్టెప్స్ వేసి తన చిరకాల కోరికను ప్రభాస్ తీర్చేసుకున్నాడు.రవీనా తో కలిసి డార్లింగ్ వేసిన స్టెప్స్ తో ప్రోగ్రామ్ ప్రోమో ఒకటి సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది.
మొత్తానికి టాలీవుడ్ హీరోయిన్ రవీనా తో కలిసి స్టెప్స్ వేసి ప్రభాస్ తన చిరకాల కోరికను తీర్చుకున్నాడు ఈ రియాలిటీ షో ద్వారా.సాహో చిత్రం ద్వారా హిట్ కొట్టి బాలీవుడ్ బాద్షా కావాలని డార్లింగ్ టార్గెట్ పెట్టుకున్నాడు అన్న విషయం అర్ధం అవుతుంది.
అందుకే మునుపెన్నడూ లేనంత హుషారుగా ఈ రియాలిటీ షో లో పాల్గొని సీనియర్ నటితో కలిసి చిందులు వేసిన వయనం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాలీవుడ్ లో పలు చిత్రాలు చేసి మెప్పించిన విషయం విదితమే.బాలకృష్ణ తో చేసిన బంగారు బుల్లోడు ఆమె టాలీవుడ్ కెరీర్ లో బెస్ట్ మూవీ గా చెప్పుకోవచ్చు.
తాజా వార్తలు