యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్నేహితులకి మంచి ప్రాధాన్యత ఇస్తాడనే టాక్ ఉంది.అతని జీవితంలో ఎవరినైనా ఫ్రెండ్స్ గా భావిస్తే వారికి అండగా ఉంటాడని కూడా చెబుతూ ఉంటారు.
ఇక తన ఫ్రెండ్స్ ని తీసుకొచ్చి ఏకంగా యూవీ క్రియేషన్స్ బ్యానర్ తో నిర్మాతలుగా మార్చేశాడు.ఏకంగా రెండు పాన్ ఇండియా సినిమాలు ఆ బ్యానర్ లోనే చేసి వారిని బడా నిర్మాతలుగా నిలబెట్టాడు.
ఇదిలా ఉంటే తనకి వర్షం సినిమాతో సూపర్ హిట్ మూవీ అందించడంతో పాటు మంచి స్నేహితుడైన శోభన్ గుండెపోటుతో చనిపోయిన సంగతి తెలిసిందే.అతనుచనిపోయిన శోభన్ కొడుకుని మాత్రం హీరోగా నిలబెట్టే బాద్యతని ప్రభాస్ తీసుకున్నాడు.
ఇప్పటికే సంతోష్ శోభన్ మూడు సినిమాలు చేశాడు.అయితే ఏవీ కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.
అయితే తన హోం బ్యానర్ అయిన యూవీ క్రియేషన్స్ నుంచి యూవీ కాన్సెప్ట్స్ తో మరో కొత్త బ్యానర్ స్టార్ట్ చేసించి మొదటి మూవీగా సంతోష్ శోభన్ తో ఏక్ మినీ కథ అనే మూవీని నిర్మించారు.ఈ మూవీ థియేటర్స్ లోనే రిలీజ్ కావాల్సి ఉన్న కరోనా కారణంగా వాయిదా పడింది.
ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 27న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.ఈ సందర్భంగా సంతోష్ శోభన్ కి ప్రభాస్ బెస్ట్ విషెస్ అందించాడు.
ఈ మూవీ తర్వాత కూడా యూవీ బ్యానర్ లో మరో సినిమాని సంతోష్ హీరోగా తెరకెక్కించదానికి రంగం సిద్ధం చేసారని, ఓ కొత్త దర్శకుడు కథతో ఈ మూవీ తెరకేక్కుతుందని తెలుస్తుంది.ఇలా యూవీ బ్యానర్ తరుపున సంతోష్ శోభన్ ని హీరోగా నిలబెట్టే బాద్యతని ప్రభాస్ తీసుకోవడం నిజంగా విశేషం అని చెప్పాలి.