టాలీవుడ్ డాషింగ్ అండ్ ఎనర్జిటిక్ హీరోల్లో గోపీచంద్ ఒకరు.ఈయన తెలుగులో మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.
ప్రస్తుతం గోపీచంద్ సీటిమార్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది.
సంపత్ నంది దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.కబడ్డీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో గోపీచంద్ కబడ్డీ లేడీస్ టీమ్ కోచ్ గా నటిస్తున్నాడు.
తమన్నా కబడ్డీ టీమ్ కోచ్ జ్వాలా రెడ్డిగా నటిస్తుంది.
ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయినా పోస్టర్స్, ట్రైలర్ వంటివి సినిమాపై అంచనాలు పెంచేసాయి.
ఈ సినిమా త్వరలోనే వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10న విడుదల అవ్వబోతున్న నేపథ్యంలో మరిన్ని ప్రమోషన్స్ చేస్తూ జనాల్లోకి తీసుకు వెళ్లాలని చిత్ర యూనిట్ బాగానే కష్టపడుతుంది.గోపీచంద్ కూడా వరుస ఇంటర్వ్యూలు చేస్తూ బిజీగా ఉంటున్నాడు.
అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న గ్రాండ్ గా నిర్వహించారు.ముందు నుండి ఈ ఈవెంట్ కు గోపీచంద్ స్నేహితుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ముఖ్య అతిధిగా రాబోతున్నాడని ప్రచారం జరిగింది.వీరిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అవ్వడం వల్ల ప్రభాస్ ఖచ్చితంగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వస్తాడని అందరు భావించారు.కానీ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రభాస్ రాలేదు.
దీంతో అభిమానులు కొద్దిగా నిరాశ చెందారు.
అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గోపీచంద్ తన స్నేహితుడు ప్రభాస్ గురించి మాట్లాడారు.ఈ ఈవెంట్ కు ప్రభాస్ రాలేకపోయిన గోపీచంద్ తన స్నేహితుడి గురించి మాట్లాడడమే కాకుండా అతడు ఏం చెప్పాడో కూడా తెలిపాడు.నా ఫ్రెండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాలేకపోయినా ట్రైలర్ చూసి చాలా బాగుంది అని కాల్ చేసి చెప్పాడని గోపీచంద్ తెలిపారు ఆ ఫ్రెండ్ ఎవరో మీకు అర్ధం అయ్యే ఉంటుంది కదా అని చెప్పుకొచ్చారు.
మొత్తానికి గోపీచంద్ ఈ సినిమాతో హిట్ కొట్టే విధంగానే ఉన్నాడు.