యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలను అనౌన్స్ చేస్తూ వస్తున్నాడు.ఇప్పటికే పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘రాధేశ్యామ్’ చిత్ర షూటింగ్ను చివరిదశకు తీసుకొచ్చిన ప్రభాస్, ఈ సినిమా రిలీజ్ కాకముందే తన నెక్ట్స్ ప్రాజెక్టులను ఓకే చేస్తున్నాడు.
ఈ క్రమంలోనే దర్శకుడు నాగ్ అశ్విన్తో ఓ సినిమా, బాలీవవుడ్ ఫిల్మ్ మేకర్ ఓం రావుత్తో ఆదిపురుష్, కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో సలార్ వంటి ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు ఈ హీరో.కాగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావుత్ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ చిత్రం కోసం యావత్ ఇండియా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటోన్న ఈ సినిమా కథ ఎలా ఉండబోతుందా అనే విషయంపై సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి.
రామాయణం ఆధారంగా ఈ సినిమా కథ ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది.అయితే ఈ సినిమాలో ప్రభాస్ మెలుహా జాతికి చెందిన నాయకుడిగా కనిపిస్తాడని తెలుస్తోంది.
తమ జాతి ప్రజల కష్టాలను ప్రభాస్ ఎలా తీరుస్తాడనేది ఈ సినిమా కథగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
మెలుహా జాతి నాయకుడిగా అంటే మనిషి రూపంలో ఉండే నాగుల జాతికి సంబంధించిన నాయకుడిగా ప్రభాస్ ఈ సినిమాలో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమా కోసం ప్రభాస్ పూర్తి మేకోవర్తో కనిపిస్తాడట.కాగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్గా ఎవరు నటిస్తారా అనే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు.
ఇక ఈ సినిమాలో విలన్గా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు.మరి ఈ సినిమా కథ ప్రేక్షకులను ఎంతవరకు థ్రిల్ చేస్తుందో తెలియాలంటే ఆదిపురుష్ చిత్రం రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.