టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ గతకొంత కాలంగా సరైన హట్ లేక సతమతమవుతున్నాడు.ఈ క్రమంలో ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సీటీమార్’పై ఆయన భారీ అంచనాలు పెట్టుకున్నాడు.
ఈ సినిమాను దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తుండటంతో ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్గా నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
పూర్తిగా కబడ్డీ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.
అయితే ఈ సినిమాకు ప్రభాస్తో లింక్ పెట్టి సోషల్ మీడియాలో వార్తలు కనిపిస్తున్నాయి.
ఈ సినిమాతో ప్రభాస్కు సంబంధం ఏమిటా అని ప్రేక్షకులు, ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.కాగా ఈ సినిమాలో నటిస్తు్న్న గోపీచంద్తో ప్రభాస్కు మంచి స్నేహం ఉన్న సంగతి తెలిసిందే.
వర్షం చిత్రంలో ప్రభాస్కు విలన్గా అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు గోపీచంద్.ఇప్పుడు ఆయన నటిస్తున్న సీటీమార్ చిత్రాన్ని ప్రమోట్ చేసేందుకు ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్కు ప్రభాస్ ముఖ్య అతిథిగా రానున్నట్లు తెలుస్తోంది.
మార్చి 28న ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ను చిత్ర యూనిట్ ప్లాన్ చేశారు.
మరి ఈ సినిమాను ప్రమోట్ చేసేందుకు డార్లింగ్ ప్రభాస్ వస్తాడా లేడా అనేది చూడాలి.
ఏదేమైనా సీటీమార్ చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్న గోపీచంద్, దానికి తగ్గట్టుగానే ప్రమోషన్స్ స్ట్రాటెజీ వాడుతుండటంతో ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.ఇక ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 2న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.
మరి సీటీమార్ చిత్రం నిజంగానే ప్రేక్షకులతో సీటీమార్ వేయిస్తుందా లేదా తెలియాలంటే ఏప్రిల్ 2 వరకు వెయిట్ చేయాల్సిందే.