యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే.ఆ సినిమా షూటింగ్ ఈ ఏడాది వరకు పూర్తి అయ్యే అవకాశం ఉంది.
ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు ప్రభాస్ ఓకే చెప్పిన విషయం తెల్సిందే.అశ్వినీదత్ నిర్మాణంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రం స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తి అయ్యింది.
షూటింగ్ను ఈ ఏడాది చివర్లో ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రభాస్, నాగ్ అశ్విన్ల కాంబోలో రూపొందబోతున్న చిత్రంను పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
బాహుబలి చిత్రాన్ని మించి ఈ సినిమా ఉంటుందనే నమ్మకంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారు.రికార్డు స్థాయి బడ్జెట్తో ఈ సినిమాను రూపొందించడంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ప్రతి విషయాన్ని మల్చబోతున్నారు.
అందులో భాగంగానే సంగీత దర్శకుడిని ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.
ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే సంగీత దర్శకుడిగా ఏఆర్ రహమాన్ రికార్డు సాధించాడు.అందుకే ఆయనతో ఈ సినిమాకు సంగీతాన్ని చేయిస్తున్నారు.ఆస్కార్ అవార్డు గ్రహీత అయిన ఏఆర్ రహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నట్లుగా వస్తున్న వార్తలతో సినిమా స్థాయి మరింతగా పెరుగుతోంది.
మహానటి తర్వాత నాగ్ అశ్విన్ చేస్తున్న సినిమా అవ్వడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.