యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తన 20వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.సాహో చిత్రం తరువాత వస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.
జిల్ ఫేం దర్శకుడు రాధాకృష్ణ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి కథతో వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ చాలా వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా ఈ సినిమా తరువాత ప్రభాస్ తన నెక్ట్స్ చిత్రాలను కూడా లైన్లో పెట్టే పనిలో పడ్డాడు.ఇప్పటికే మహానటి చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ఓ భారీ సినిమాకు ఓకే చెప్పిన ప్రభాస్, ఆ తరువాత మరో పాన్ ఇండియా సినిమాను ఓకే చేసేందుకు రెడీ అవుతున్నాడు.
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో దర్శకుడు వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేయబోయే ఓ భారీ ప్రాజెక్ట్ సినిమాలో ప్రభాస్ నటిస్తాడని తెలుస్తోంది.దీనికి సంబంధించిన స్క్రిప్టు పనులు శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాతో మరోసారి ప్రభాస్ తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు.
అయితే ప్రస్తుతం వేణు శ్రీరామ్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ చిత్రం రిలీజ్కు రెడీ అవుతోంది.
ఈ సినిమాతో పవన్ అదిరిపోయే రీఎంట్రీ ఇస్తాడని, చిత్రం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని తెలుస్తోంది.ఇక ప్రభాస్ 20వ చిత్రంలో అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోండగా ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.