యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరసగా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నాడు.ఆయన రాధే శ్యామ్ సినిమా చేస్తూనే సలార్ సినిమా షూటింగ్ కూడా ప్రారంభించారు.
రాధే శ్యామ్ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.తదుపరి చిత్రం సలార్ చేస్తున్నట్లు ప్రభాస్ ప్రకటించాడు.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా రూపొందుతుంది.ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు.హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరంగదుర్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు.
మొదట ఈ సినిమా కోసం బాలీవుడ్ భామలను తీసుకోవాలని ప్రశాంత్ నీల్ అనుకున్నాడని.కొంతమందిని సంప్రదించాడని కూడా వార్తలు వచ్చాయి.కానీ చివరికి శృతి హాసన్ ని తీసుకుని అందరికి పెద్ద షాక్ ఇచ్చాడు.జనవరి 28 న శృతి హాసన్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసారు.
శృతి హాసన్ కు బర్త్ డే విషెస్ చెప్తూ.సలార్లోకి మీకు స్వాగతం.
మిమ్మల్ని తెరపై చూపించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం’ అని పేర్కొన్నారు.
తాజాగా శృతి హాసన్ నటించిన క్రాక్ సినిమా సంక్రాంతికి రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
ఈ సినిమా విజయంతో శృతి హాసన్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది.
పవర్ఫుల్ యాక్షన్ గా సలార్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
ఈ సినిమా గురించి రోజుకో న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఈ సినిమా షూటింగ్ గోదావరిఖనిలోని బొగ్గు గనుల్లో శుక్రవారం ప్రారంభమయ్యింది.
అయితే సోమవారం రోజు శృతి హాసన్ ఈ చిత్ర షూటింగ్ లో కూడా పాల్గొన్నారని.ప్రభాస్ శృతి హాసన్ మీద కొన్ని సీన్లు కూడా చిత్రీకరించారని సమాచారం అందుతుంది.