యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు కేజీఎఫ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ల కాంబోలో సలార్ సినిమా ప్రారంభం అయిన విషయం తెల్సిందే.ఈ సినిమా ను కేజీఎఫ్ సినిమాను నిర్మిస్తున్న హంబులే నిర్మాణ సంస్థ నిర్మిస్తుంది.
ఈ సమయంలోనే దిల్ రాజు నిర్మాణంలో ప్రభాస్ ఒక సినిమా ను చేసేందుకు ఓకే చెప్పాడు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.బాహుబలి సమయంలోనే దిల్ రాజుకు ఒక సినిమాను చేసేందుకు ప్రభాస్ హామీ ఇచ్చాడు.
అందుకే వచ్చే ఏడాది లేదా ప్రస్తుతం కమిట్ అయ్యి ఉన్న సినిమాలు పూర్తి అయిన తర్వాత చేసేందుకు ఓకే చెప్పాడు.దాంతో దిల్ రాజు కథలు ఎంపిక చేసే పనిలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఇదే సమయంలో ఆయన ప్రభాస్ తో నిర్మించబోతున్న సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించేందుకు సిద్దంగా ఉన్నాడు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ఒక వైపు సలార్ సినిమాను చేస్తూనే ఉన్న ప్రభాస్ మరియు ప్రశాంత్ నీల్ లు అప్పుడే రెండవ సినిమా ను చేయడం అంటే నిజంగా చాలా ఆశ్చర్యకర విషయం.
అసలు సంగతి ఏంటీ అంటే సలార్ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ ఇప్పటికే ఎన్టీఆర్.అల్లు అర్జున్ మరియు యశ్ లతో సినిమాలు చేయాల్సి ఉంది.ఈ మూడు సినిమాలు చేయాలంటే కనీసం మూడు ఏళ్లు పడుతుంది.ఆ తర్వాత ప్రభాస్ సినిమా చేస్తాడేమో అనుకుంటే అంత సమయం వరకు దిల్ రాజు ఉండటం అనుమానమే అంటున్నారు.
ఇదే సమయంలో దిల్ రాజు సన్నిహితులు ఒకరు మీడియాతో అనధికారికంగా మాట్లాడుతూ ప్రభాస్ తో దిల్ రాజు సినిమా ఉంది.కాని అది ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో అంటూ వస్తున్న వార్తలు నిజం కాదని క్లారిటీ ఇచ్చాడు.
ప్రభాస్ తో సినిమా వేరు… అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో సినిమా వేరేగా ఉంటుందని ఆయన నమ్మకంగా చెబుతున్నారు.అసలు విషయం ఏంటీ అనేది కాలమే నిర్ణయిస్తుంది.