యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న సలార్ మూవీ కోసం దేశ వ్యాప్తంగా అంచనాలు భారీగా ఉన్నాయి.ఈ భాష ఆ భాష అని కాకుండా అన్ని భాషల్లో కూడా ఈ సినిమా విడుదల కోసం ఇప్పటి నుండే వెయిట్ చేస్తున్నారు.
వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా లో యాక్షన్ సన్నివేశాలు కేజీఎఫ్ ను మించి ఉంటాయని అంటున్నారు.యాక్షన్ సినిమా గా రూపొందుతున్న ఈ సినిమా కథ విషయమై కన్నడ మీడియా వర్గాల్లో ఆసక్తి కర చర్చ జరుగుతోంది.
వారు చెబుతున్న దాని ప్రకారం సలార్ మూవీ కథ నాలుగు సంవత్సరాల క్రితం దర్శకుడు ప్రశాంత్ నీల్ తయారు చేసుకున్నాడట.ఆ సమయంలోనే యశ్ కు ఈ కథ చెప్పాడని తెలుస్తోంది.
కేజీఎఫ్ మరియు సలార్ మూవీ కథలు చెప్పిన సమయంలో యశ్ కు కేజీఎఫ్ స్టోరీ లైన్ బాగా నచ్చిందట.సలార్ కథ కంటే కూడా కేజీఎఫ్ కథ మాస్ కు మరింతగా కనెక్ట్ అయ్యే విధంగా ఉందని అలాగే సలార్ మూవీ కథ లో కాస్త డ్రామా ఎక్కువగా ఉన్న కారణంగా మొదట కేజీఎఫ్ ను చేయాలని నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.
కేజీఎఫ్ సినిమా నిరాశ పర్చితే యశ్ తో సలార్ మూవీని చేయాలని మొదటే ప్రశాంత్ నీల్ భావించాడట.కాని కేజీఎఫ్ సూపర్ హిట్ అవ్వడం తో పాటు కేజీఎఫ్ 2 సెన్షేషనల్ సక్సెస్ అవ్వడం ఖాయం అన్నట్లుగ అంచనాలు ఉన్నాయి.
అందుకే ఈ సినిమా ను భారీ ఎత్తున ప్రభాస్ తో తెరకెక్కించేందుకు ప్రశాంత్ నీల్ సిద్దం అయ్యాడు.సలార్ కు యశ్ తో పోల్చితే ప్రభాస్ ఇంకా ఎక్కువ న్యాయం చేస్తాడని కూడ ప్రశాంత్ నీల్ భావిస్తున్నాడట.
సలార్ మూవీ మొదటి షెడ్యూల్ పూర్తి అవ్వగా రెండవ షెడ్యూల్ కు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.