ప్రభాస్ బాహుబలి.సాహో సినిమాల సమయంలో ఎంత ఖాళీగా ఉన్నాడో ఇప్పుడు అంత బిజీగా ఉన్నాడు.
కొత్త సినిమాల కోసం ఏళ్లు ఏళ్లుగా ఎదురు చూస్తున్న ప్రభాస్ అభిమానుల కోసం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వస్తున్నాయి.ఈ ఏడాది ఒక సినిమా రాబోతుండగా వచ్చే ఏడాది రెండు మూడు సినిమాలు విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నాడు.
మొత్తానికి ప్రభాస్ ఫుల్ బిజీగా అయితే ఉన్నాడు.ప్రస్తుతం ఆది పురుష్ షూటింగ్ కోసం ముంబయిలో ఉన్నాడు.
ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న హిందీ మూవీ ఆది పురుష్ లో హీరోయిన్ గా కృతి సనన్ ను ఎంపిక చేయడం జరిగింది ఈ నెలాఖరు వరకు ఆది పురుష్ షెడ్యూల్ పూర్తి కాబోతుంది.దాంతో వెంటనే ప్రభాస్ సలార్ షూటింగ్ కు ఓకే చెప్పాడని సమాచారం అందుతోంది.
కేజీఎఫ్ 2 షూటింగ్ ను ఇటీవలే ముగించేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేస్తూనే మరో వైపు సలార్ మూవీ షూటింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నాడు.ఇప్పటికే ఒక షెడ్యూల్ ను తెలంగాణ లో పూర్తి చేసిన సలార్ త్వరలోనే కొత్త షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారు.
గుజరాత్ లో సలార్ సెకండ షెడ్యూల్ ను ఖరారు చేయడం జరిగింది.ఈ నెలాఖరు వరకు లేదా వచ్చే నెల ఆరంభంలోనే గుజరాత్ లో దాదాపుగా మూడు లేదా నాలుగు వారాల పాటు సలార్ చిత్రం షూటింగ్ ను చేస్తారని అంటున్నారు.
ప్రభాస్ తో పాటు ఈ సారి హీరోయిన్ శృతి హాసన్ కూడా షూట్ లో జాయిన్ అవ్వబోతుందట.భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు సినిమాకు సంబంధించిన కొంత టాకీ పార్ట్ ను కూడా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.
అతి త్వరలోనే పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.