ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రూపొందుతున్న రాధే శ్యామ్ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యిందని ఇటీవలే యూవీ క్రియేషన్స్ వారు అన్నారు.కాని ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన కీలక రొమాంటిక్ సాంగ్ ను చిత్రీకరించలేదట.
సినిమాలో ఈ పాటను ఈమద్యే చేర్చారనే వార్తలు కూడా వస్తున్నాయి.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రాధే శ్యామ్ ను బాలీవుడ్ కు కొనుగోలు చేసిన నిర్మాతలు సినిమా లో రొమాంటిక్ సాంగ్ లేకుంటే ఎలా సినిమా ను ప్రమోట్ చేయడం ఎలా అంటూ వాపోయారట.
దాంతో యూవీ క్రియేషన్స్ వారు రెండున్నర కోట్లు పెట్టి ఒక రొమాంటిక్ సినిమా ను తెరకెక్కించేందుకు గాను సిద్దం అయ్యారని తెలుస్తోంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ముంబయిలోని ఒక సెట్ లో ఈ రొమాంటిక్ సాంగ్ ను చిత్రీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
రాధేశ్యామ్ లోని ఈ రొమాంటిక్ సాంగ్ సినిమా స్థాయిని పెంచే విధంగా ఉంటుందని అంటున్నారు.ప్రభాస్ మరియు పూజా హెగ్డేల కాంబోలో సాగే ఈ సాంగ్ వావ్ అన్నట్లుగా ఉంటుందట.
పాటలో పూజా హెగ్డే లుక్ కూడా చాలా విభిన్నంగా ఉంటుందని అంటున్నారు.అందాల ఆరబోతతో పాటు ఇద్దరి మద్య కెమిస్ట్రీ అదిరి పోతుందని అంటున్నారు.ముద్దు సన్నివేశాల నుండి బెడ్ సన్నివేశాల వరకు ఈ పాటలో చాలా ఉంటాయని అంటున్నారు.ఇదే సమయంలో వీరి డాన్స్ కూడా సినిమా పాటలో కీలకంగా ఉంటుందని అంటున్నారు.
మొత్తానికి రాధే శ్యామ్ లో ఒక్కటి అంటే కనీసం ఒక్క రొమాంటిక్ నెంబర్ కూడా లేదంటూ వినిపిస్తున్న విమర్శలకు ఇది ఫుల్ స్టాప్ పెడుతుంది.ఈ పాటతో మరింతగా సినిమా కు బిజినెస్ అవుతుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమా లో కృష్ణం రాజు కీలక పాత్రలో కనిపించబోతున్న నేపథ్యంలో అంతా కూడా అంచనాలు పెంచేసుకుంటున్నారు.కరోనా సెకండ్ వేవ్ కుదుట పడ్డ తర్వాత విడుదల విషయంలో స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.