ప్రభాస్, నాగ్‌ అశ్విన్‌ మూవీ ఒక గుడ్‌ న్యూస్‌.. ఒక బ్యాడ్‌ న్యూస్‌

యంగ్ రెబల్ స్టార్‌ ప్రభాస్ అభిమానులకు బ్యాక్ టు బ్యాక్‌ బిగ్గెస్ట్‌ సినిమా లు బహుమానంగా రాబోతున్నాయి.ప్రభాస్ క్రేజ్ ప్రతి సినిమా తో రెట్టింపు అవ్వడం ఖాయం అంటున్నారు.

 Prabhas And Nag Aswin Movie Interesting Update , Adipurush, Nag Ashwin, Prabhas,-TeluguStop.com

మొదటగా రాధేశ్యామ్‌ ను ఈ ఏడాదిలో విడుదల చేయబోతున్నారు.ఆ తర్వాత ప్రశాంత్ నీల్‌ కాంబోలో రాబోతున్న సలార్‌ మూవీ భారీ ఎత్తున అంచనాలు కలిగి ఉంది.

ఆ సినిమా వచ్చే ఏడాది లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.భారీ ఎత్తున అంచనాలున్న సలార్ సినిమా తో పాటు ఆది పురుష్‌ సినిమా కూడా ప్రస్తుతం తెరకెక్కుతుంది.

ఈ మూడు సినిమాలతో పాటు అత్యంత క్రేజ్ కలిగి ఉన్న సినిమా ను నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం లో చేయబోతున్నాడు.నాగ్‌ అశ్విన్‌ మహానటి తర్వాత చేయబోతున్న సినిమా అవ్వడంతో అందరిలో కూడా అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

నాగ్‌ అశ్విన్‌ సినిమా అన్ని అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఇప్పటికే ప్రారంభం అవ్వాల్సి ఉంది.కాని కరోనా కారణంగా ఆలస్యం అవుతూ వచ్చింది.కరోనా మొదటి వేవ్ కారణంగా జూన్‌ కు వాయిదా పడ్డ నాగ్ అశ్విన్ మూవీ సెకండ్‌ వేవ్ కారణంగా అక్టోబర్ కు వాయిదా పడ్డట్లుగా సమాచారం అందుతోంది.ప్రస్తుతం సినిమా కు సంబంధించిన స్క్రిప్ట్‌ మొత్తం కూడా పూర్తి చేసి దర్శకుడు సిద్దంగా ఉన్నాడు.

ప్రభాస్ తో సినిమా కోసం నాగ్‌ అశ్విన్‌ రెండేళ్లుగా ఎదురు చూస్తున్నారు.ఈ ఏడాది దీపావళికి సినిమా ప్రారంభం కాబోతుందని తెలుస్తోంది.

ఇది అభిమానులకు గుడ్‌ న్యూస్ కాని బ్యాడ్‌ న్యూస్ ఏంటీ అంటే గతంలో సినిమా ను 2022 లో విడుదల చేస్తామని ప్రకటించారు.కాని అది సాధ్యం అయ్యేలా లేదు.2023 వరకు సినిమా కోసం అభిమానులు వెయిట్‌ చేయాల్సిందే అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube