యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కేందుకు సిద్ధంగా ఉన్నాయి.రాధేశ్యామ్ సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగా తరువాత ఆది పురుష్ సినిమా చేయనున్నాడు.
ఈ సినిమా పూర్తిచేసిన వెంటనే నాగ్ అశ్విన్ సినిమాపైకి వెళ్తాడు.తరువాత ప్రసాన్త నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా తెరకెక్కుతుంది.
వరుసగా మూడు భారీ బడ్జెట్ సినిమాలు డార్లింగ్ లైన్ లో ఉన్నాయి.వీటిలో ఇప్పటికే ఆది పురుష్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది.
ఫిబ్రవరిలో ప్రభాస్ ఆది పురుష్ షూటింగ్ లో జాయిన్ అవుతాడు.ఇక రీసెంట్ గా ప్రశాంత్ నీల్ సలార్ మూవీ ప్రకటించడంతో పాటు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయడం వలన అది పురుష్ తరువాత అదే సినిమా సెట్స్ పైకి వెళ్తుందని అందరూ భావించారు.
నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ సైన్స్ ఫిక్షన్ సినిమా కాబట్టి మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని టాక్ వినిపించింది.
అయితే దీనిపై నాగ్ అశ్విన్ తాజాగా కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.తాజాగా సోషల్ మీడియా లైవ్ లో అభిమానులతో నాగ్ అశ్విన్ ముచ్చటించే సమయంలో ఒక ప్రభాస్ అభిమాని సినిమా ఎనౌన్సమెంట్ ఎప్పుడు ఉండబోతుంది కాస్తా క్లారిటీ ఇవ్వమని అడగడంతో సంక్రాంతి తర్వాత సినిమాకి సంబంధించి కీలక అప్డేట్ ఉండబోతుందని, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ మంచి ఫ్లోలో నడుస్తుందని స్పష్టం చేశాడు.దీంతో ఈ సినిమాపై వచ్చిన రూమర్స్ కి ఫుల్ స్టాప్ పడినట్లు అయ్యింది.
సైన్స్ ఫిక్షన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూపర్ హీరోలా ప్రభాస్ కనిపిస్తాడని తెలుస్తుంది.ఇందులో దీపికా పదుకునే పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతుంది.అలాగే స్టార్ క్యాస్టింగ్ ని సినిమా కోసం ఎంపిక చేయబోతున్నట్లు సమాచారం.ఈ సినిమాని అశ్వినీదత్ ఏకంగా 450 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.