తెలుగులో ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఓ భారీ బడ్జెట్ చిత్రంలో హీరోగా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.అయితే ఈ చిత్రానికి అలనాటి అందాల తార మరియు ప్రముఖ స్వర్గీయ నటి సావిత్రి జీవిత గాథను కళ్లకు కట్టినట్లు తెరకెక్కించి తమిళ, తెలుగు సినిమా ప్రేక్షకుల మన్ననలు పొందిన యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు.
అయితే ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు ప్రారంభం కావాల్సి ఉండగా గత ఏడాది కరోనా వైరస్ కారణంగా తాత్కాలికంగా షూటింగ్ పనులు నిలిపివేశారు.దీంతో ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గడంతో మళ్లీ చిత్ర యూనిట్ సభ్యులు షూటింగ్ పనులు షురూ చేయబోతున్నారు. దీంతో తాజాగా ఈ చిత్రంలో నటించడానికి కావలసినటువంటి నటీనటుల కోసం క్యాస్టింగ్ కాల్ ని అనౌన్స్ చేశారు.ఇందులో భాగంగా 9 నుంచి 14 సంవత్సరాలు కలిగిన బాలికలు మరియు 20 నుంచి 35 సంవత్సరాలు కలిగినటువంటి మగ నటులు, డాన్సర్లు, అలాగే మార్షల్ ఆర్ట్స్ లో అనుభవం ఉన్నటువంటి వారు తమ బయోడేటా వివరాలను VYMTALENT@GMAIL.
COM అనే మెయిల్ ఐడి కి పంపించాలని కోరారు.
దీంతో ప్రభాస్ సినిమాలో నటించే అవకాశం దక్కించుకోవాలని కొందరు నెటిజన్లు తమ బయోడేటా వివరాలను చిత్ర యూనిట్ సభ్యులు తెలిపిన ఈ-మెయిల్ ఐడి కి పంపిస్తున్నారు. అంతేగాక ఈ విషయంపై స్పందించిన కొందరు నెటిజన్లు ప్రస్తుతం సినిమా పరిశ్రమలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి సోషల్ మీడియా మాధ్యమాలు చాలా బాగా ఉపయోగపడతాయని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అంతేగాక ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా దాదాపుగా 300 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ నిర్మిస్తోంది.
కాగా ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ తరహాలో ఉండబోతోందని పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.అయితే ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే మరియు మలయాళ యంగ్ బ్యూటీ నివేదాథామస్ లు ప్రభాస్ కి జంటగా నటిస్తున్నారు.
కాగా ఈ చిత్రంలో నటించడానికి ప్రభాస్ దాదాపుగా 100 కోట్ల రూపాయలు పారితోషకంగా తీసుకోబోతున్నాడని కొందరు చర్చించుకుంటున్నారు.ఏదేమైనప్పటికీ బాహుబలి చిత్రంతో ప్రపంచానికి పరిచయమైన ప్రభాస్ తన తదుపరి చిత్రాల్లోని బడ్జెట్ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదని చెప్పవచ్చు.