యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు ఇండియన్ హీరోగా మారిపోయాడు.అతని సినిమాలు అన్ని కూడా పాన్ ఇండియా రేంజ్ లో ఉంటాయి.
ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పాన్ ఇండియా మూవీ అనే విషయం అందరికి తెలిసిందే.ఈ సినిమా తర్వాత మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాని సుమారు నాలుగు వందల కోట్ల బడ్జెట్ తో అశ్వినీదత్ నిర్మిస్తున్నారు.ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి కాస్టింగ్ సెలక్షన్ జరుగుతున్నట్లు తెలుస్తుంది.
ఇక ఈ సినిమా హీరోయిన్ విషయంలో హీరో, దర్శకుడు మధ్య కాస్తా అభిప్రాయ బేధాలు వచ్చినట్లు టాక్ వినిపిస్తుంది.ఇందులో కత్రినా కైఫ్ ని తీసుకోవాలని ప్రభాస్ రిఫర్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది.
అయితే హీరోయిన్ పాత్రకి ఆమె సరిపోదని, దానికి పూజాహేగ్దే, కియరా అద్వానీలో ఎవరో ఒకరిని ఫైనల్ చేయాలని నాగ్ అశ్విన్ చూస్తున్నట్లు సమాచారం.ఈ విషయంలో ప్రభాస్, నాగ్ అశ్విన్ మధ్య కొద్దిగా భేదాప్రియాలు వచ్చాయనే మాట వినిపిస్తుంది.
మరి ఇది ఎంత వరకు వాస్తవం అనేది తెలియాలంటే వారు క్లారిటీ ఇచ్చేంత వరకు వేచి చూడాలి.