బాహుబలి సినిమా తర్వాత డార్లింగ్ ప్రభాస్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ మారిపోయాడు.
దీంతో అతని ప్రతి సినిమాపైన కూడా ఇండియా వైడ్ గా ఆసక్తి నెలకొని ఉంటుంది.బాహుబలి తర్వాత వచ్చిన సాహో సినిమా తెలుగు ప్రేక్షకులకి అంతగా కనెక్ట్ కాకపోయినా బాలీవుడ్ లో మాత్రం మంచి వసూళ్లు రాబట్టింది.
ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమాని రాధాకృష్ణ దర్శకత్వలో తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమా మెజారిటీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయిపోయింది.
త్వరలో హైదరాబాద్ లో పారిస్ సెట్ వేసి మిగిలిన భాగం అంతా షూట్ చేయబోతున్నారు.ఇందులో పూజాహెగ్డే ప్రభాస్ కిజోడీగా నటిస్తుంది.
ఇదిలా ఉంటే ప్రభాస్ నెక్స్ట్ సినిమాని మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే కంప్లీట్ అయినట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన క్యాస్టింగ్ సెలక్షన్ పై దర్శకుడు ద్రుష్టి పెట్టాడు.ముఖ్యంగా గతకొంత కాలంగా సినిమాలో హీరోయిన్ ఎంపికపైన చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తుంది.
ఇక బాలీవుడ్ లో చాలా మంది పేర్లు హీరోయిన్స్ కోసం పరిశీలించారు. సైన్స్ ఫిక్షన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కూడా చాలా చాలా ప్రాధాన్యత కలిగి ఉంది.
ఈ నేపధ్యంలో ఈ సినిమా కోసం తాజాగా దీపికా పదుకునేని హీరోయిన్ గా ఫైనల్ చేస్తూ వైజయంతి మూవీస్ సంస్థ అధికారికంగా ప్రకటించింది.ఇప్పటికే చాలా మంది హీరోయిన్లను తెలుగు తెరపైకి పరిచయం చేసిన వైజయంతి మూవీస్ ప్రభాస్ 21వ సినిమా హీరోయిన్ పేరును ఓ వీడియో రూపంలో ప్రకటిస్తూ గతంలో తమ సంస్థ తీసిన సినిమాల్లో నటించిన హీరోయిన్ల పేర్లను కూడా గుర్తు చేస్తూ వీడియో ప్రోమో రిలీజ్ చేసింది.