యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతున్న చిత్రాల జాబిత చాలానే ఉంది.ప్రస్తుతం చేస్తున్న సినిమాలు మాత్రమే కాకుండా ప్రభాస్ మూడు నాలుగు సినిమాలకు కమిట్ అయ్యాడు.
ప్రస్తుతం కొత్త కథలు కూడా వింటున్నాడు.ఇటీవలే సుధ కొంగరా దర్శకత్వంలో సినిమా ను చేసేందుకు కథ విన్నాడంటూ వార్తలు వచ్చాయి.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సుధ కొంగర స్టోరీ లైన్ నచ్చడంతో స్క్రిప్ట్ తో రమ్మంటూ ప్రభాస్ టీమ్ సూచించారట.ఇదే సమయంలో మరో కథకు కూడా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఓకే చెప్పాడంటూ వార్తలు వస్తున్నాయి.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం దర్శకుడు చంద్ర శేఖర్ యేలేటి ఒక కథను రెడీ చేసి వినిపించాడట.ఆన్ లైన్ ద్వారా చంద్రశేఖర్ యేలేటి చెప్పిన కథను ప్రభాస్ సావదానంగా విని ఆ తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటూ సమాచారం అందుతోంది.ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా షూటింగ్ మరో రెండు వారాల వర్కింగ్ డేస్ మినహా పూర్తి అయ్యింది.మరో వైపు ఆదిపురుష్ మరియు సలార్ సినిమాలు సెట్స్ పై ఉన్నాయి.
రెండు సినిమాలు కూడా కాస్త అటు ఇటుగా ఒకే తరహాలో షూటింగ్ జరుపుకుంటున్నాయి.సలార్ సినిమా ఈ ఏడాది ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఆదిపురుష్ సినిమా వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల కాబోతుంది.ఇదే సమయంలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ఒక సినిమాకు రెడీ అవుతున్నాడు.
ఈ ఏడాది చివరి నుండి రెగ్యులర్ షూటింగ్ ను మొదలు పెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఇలాంటి సమయంలో ప్రభాస్ కొత్త సినిమా చేయాలంటే కనీసం రెండేళ్ల సమయం పడుతుంది.
చంద్రశేఖర్ యేలేటి నిజంగానే కథ చెప్పినా కూడా వీరి కాంబో మూవీ పట్టాలెక్కేందుకు కనీసం రెండేళ్ల సమయం పడుతుంది.మరి అప్పటి వరకు ఆయన వెయిట్ చేస్తాడా లేదా మరో హీరోతో సినిమాను మొదలు పెడతాడా అనేది చూడాలి.