సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోహీరోయిన్ల మధ్య ఏదో సంబంధం ఉంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు రావడం సర్వసాధారణం.ఒక జంట ఒక సినిమాలో నటించి ఆ సినిమా మంచి విజయం సాధిస్తే చాలు ఇక ఆ జంట మధ్య ప్రేమ బంధం ఉందంటూ పెద్దఎత్తున పుకార్లు సృష్టిస్తారు .
ఈ విధంగా ఒకటి కాదు రెండు కాదు ఐదు చిత్రాల్లో నటిస్తూ ఎంతో పాపులర్ అయినటువంటి జంటలలో ప్రభాస్ -అనుష్క జోడి ఒకటని చెప్పవచ్చు.వీరిద్దరూ కలిసి ఏకంగా అయిదు సినిమాలలో నటించే సరికి వీరీమధ్య ప్రేమ ఉందని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
ఇక బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు రావడంతో కచ్చితంగా అనుష్కనే పెళ్లి చేసుకుంటున్నారు అని ఫిక్స్ అయిపోయారు.ఈ జోడి కేవలం ఆన్ స్క్రీన్ పై మాత్రమే కాకుండా, బయట కూడా చాలా సన్నిహితంగా ఉండటంతో ప్రతి ఒక్కరూ వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనీ భావించారు.
అయితే వారిపై వస్తున్నటువంటి రూమర్లకు చెక్ పెడుతూవారిద్దరూ మంచి స్నేహితులని మా మధ్య ఏ విధమైనటువంటి ప్రేమలేదని గట్టిగా ఖండించారు.సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉండే ఈ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో చాలా అరుదుగా కనిపిస్తారు.
తాజాగా సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ ఒక పోస్టు చేయడంతో కేవలం కొంత సమయం తేడాతో అనుష్క కూడా అదే పోస్ట్ చేయడంతో నెటిజన్లు ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు.ఇంతకీ అనుష్క ప్రభాస్ ను ఏ విషయంలో ఫాలో అయింది అనే విషయానికి వస్తే ఇటీవల టోక్యోలో జరిగినటువంటి పారా ఒలింపిక్స్ క్రీడలలో భాగంగా భారత ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శనను కనపరిచిన 19 పథకాలను సంపాదించారు.ఈ క్రమంలోనే ఈ విషయంపై స్పందిస్తూ ప్రభాస్ అథ్లెట్లను ప్రశంసిస్తూ ముందుగా ప్రభాస్ పోస్ట్ చేయగా కొంత సమయం తేడాతో ఇదే పోస్టును అనుష్క చేశారు.ఈ విధంగా ఇద్దరు కలిసి ఇంస్టాగ్రామ్ వేదిక ఒకటే పోస్ట్ చేశారు.
ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం అనుష్క ఏ విధమైనటువంటి సినిమాలను చేస్తున్నట్లు సమాచారం లేకపోయినప్పటికీ ప్రభాస్ మాత్రం సలార్ , ఆది పురుష్ , రాధేశ్యామ్ ప్రాజెక్ట్ కే వంటి చిత్రాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.