ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న హిందీ మూవీ ఆదిపురుష్ షూటింగ్ ప్రారంభం అయ్యింది.ఈ సినిమా లో రాముడి పాత్రను ప్రభాస్ చేస్తున్నాడని రావణుడిగా సైఫ్ అలీ ఖాన్కనిపించబోతున్నట్లుగా చాలా రోజుల క్రితమే వార్తలు వచ్చాయి.
కాని ఈ సినిమా లో కనిపించబోతున్న సీత మరియు లక్ష్మణుడి పాత్రకు గాను ఎవరిని ఎంపిక చేశారు అనే విషయమై క్లారిటీ ఇవ్వలేదు.గత కొన్ని నెలలుగా ఆ విషయమై పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేశాయి.
ఎట్టకేలకు ఆ విషయాన్ని చిత్ర యూనిట్ సభ్యులు క్లారిటీ ఇచ్చారు.మొదటి నుండి ఈ సినిమా లో హీరోయిన్ గా కృతి సనన్ కనిపించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.
అవి కేవలం పుకార్లే అంటూ చాలా మంది అనుకున్నారు.ఇక ఈ సినిమా లో లక్ష్మణుడి పాత్ర కు గాను ఆయుష్మాన్ ఖురానాను ఎంపిక చేయబోతున్నట్లుగా ప్రచారం జరిగింది.
ఈమద్య కాలం లో వచ్చిన ఈ రెండు పకార్ల విషయమై ఆదిపురుష్ చిత్ర యూనిట్ సభ్యులు ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు.లక్ష్మణుడి పాత్ర కు ఆయుష్మాన్ ను ఎంపిక చేయలేదు అంటూ చెప్పడంతో పాటు సన్నీ సింగ్ ను ఆ పాత్రకు ఎంపిక చేసినట్లుగా తెలియజేశారు.
ఇక సీత పాత్ర విషయంలో కూడా క్లారిటీ ఇచ్చేశారు.గత కొంత కాలంగా పుకారు అనుకుంటున్న విషయంను నిజం అంటూ ఆదిపురుష్ హీరోయిన్ గా కృతి సనన్ ను ఎంపిక చేయడం జరిగిందని ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు.
మొత్తానికి ఈ సినిమా రేంజ్ ను పెంచే విధంగా కొత్త ప్రకటన చేయడం జరిగింది.ప్రస్తుతం సినిమా షూటింగ్ ను ముంబయిలో నిర్వహిస్తున్నారు.ఆ సినిమా షూటింగ్ కోసం వీరు పాల్గొంటున్నారు.