యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas ) హీరోగా బాలీవుడ్ లో రూపొందిన చిత్రం ‘ఆదిపురుష్’.( Adipurush ) షూటింగ్ ప్రారంభించిన సమయంలో ఈ సినిమా గురించి తెగ మాట్లాడుకున్నారు.
ఎప్పుడైతే టీజర్ విడుదల అయ్యిందో అప్పటి నుండి సినిమా గురించి మాట్లాడుకోవడం తగ్గింది.నిన్న మొన్నటి వరకు ఈ సినిమా గురించి జనాలు పెద్దగా పట్టించుకోలేదు.
కానీ ఎప్పుడైతే సినిమా యొక్క ట్రైలర్ విడుదల అయ్యిందో అప్పటి నుండి తెగ ఈ సినిమా గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది.ట్రైలర్ అద్భుతంగా వచ్చింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.
సినిమా యొక్క అంచనాలు మరియు స్థాయి అమాంతం పెరిగింది.సినిమా వెయ్యి కోట్ల వసూళ్లు సాధించడం ఖాయం అంటూ ఫ్యాన్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
అంతకు ముందు వరకు సినిమా కనీసం వంద నుండి 150 కోట్ల రూపాయలు అయినా వసూళ్లు చేస్తుందా అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేశారు.కానీ ఇప్పుడు మాత్రం వెయ్యి కోట్ల టార్గెట్ తో సినిమా ని విడుదల చేయబోతున్నారు.ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ.250 కోట్ల నుండి రూ.300 కోట్ల వసూళ్లు సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.ఆదిపురుష్ తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి పోటీ లేకుండా భారీ ఎత్తున విడుదల అవ్వబోతుంది.
అంతే కాకుండా ఈమధ్య కాలంలో వచ్చిన ఏ ఒక్క సినిమా కూడా సక్సెస్ అయిన దాఖలాలు లేవు.
అందుకే ఆదిపురుష్ సినిమా సక్సెస్ టాక్ దక్కించుకుంటే ఈజీగా 300 కోట్ల వసూళ్లు నమోదు అవుతాయి.ఇక ఇతర భాషల్లో మరియు ఓవర్సీస్ లో కలిపి వెయ్యి కోట్ల వరకు వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.రాముడి పాత్రలో ప్రభాస్ నటించగా.
కృతి సనన్ సీత పాత్రలో( Kriti Sanon ) నటించిన విషయం తెల్సిందే.ఓమ్ రౌత్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో రూపొందించాడు.
ఇండియాస్ బిగ్గెస్ట్ మోషన్ గ్రాఫిక్స్ మూవీ అంటూ ఈ సినిమా గురించి ప్రచారం చేస్తున్నారు.ప్రపంచ వ్యాప్తంగా 3డి వర్షన్ లో కూడా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.