ప్రభాస్ చేయబోతున్న ‘ఆది పురుష్’ సినిమాపై అంచనాలు అప్పుడే ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.దాదాపుగా 500 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కతున్నట్లుగా సమాచారం అందుతోంది.
బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ సినిమా కోసం ప్రభాస్ ఏకంగా వంద కోట్ల పారితోషికంను అందుకోబోతున్నాడు అంటున్నారు.ఈ సినిమాలో నటించే నటీనటుల మరియు సాంకేతిక నిపుణుల పారితోషికాలు దాదాపుగా 200 కోట్లుగా చెబుతున్నారు.
మిగిలిన 300 కోట్లతో సినిమా రూపొందబోతుంది.
బాహుబలి సినిమాతో ప్రభాస్ తన స్టామినాను నిరూపించుకున్నాడు.
వందల కోట్ల రూపాయలను సునాయాసంగా రాబట్టగలను అంటూ సాహోతో మరోసారి నిరూపించాడు.కనుక ఆది పురుష్ మూవీ ఈజీగా వెయ్యి కోట్ల ప్రాజెక్ట్ గా నిలుస్తుందనే నమ్మకంను ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు.
అద్బుతమైన ఈ సినిమాను ఇండియన్ సినీ ప్రేక్షకులు అంతా కూడా చూసేందుకు ఉవ్విల్లూరుతున్నారు.ఒక వైపు అయోద్య రామ మందిర నిర్మాణం జరుగుతుండగా మరో వైపు ఆది పురుష్ అంటూ రాముడిపై సినిమాను రూపొందిస్తున్న కారణంగా ప్రతి ఒక్క హిందువు ఎంతో ఉత్సహంతో ఎదురు చూస్తున్నారు.
రాముడిగా ప్రభాస్ కనిపించబోతున్నాడు అంటూ ఇప్పటికే క్లారిటీ వచ్చింది.ఇక లంకేష్ అయిన రావణుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు.అంచనాలకు ఏమాత్రం అందకుండా ఊహలకు అతీతంగా ఆది పురుష్ ఉంటుందనే నమ్మకంను ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు.అన్ని వర్గాల వారు ఈ సినిమాను చూస్తారు.
ఎందుకంటే ఇది ఒక అద్బుతమైన మైథలాజికల్ మూవీగా నిలవడం ఖాయం.ఈ చిత్రంలో సీతగా ఎవరు నటిస్తారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.