పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా ”ఆదిపురుష్”.రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించారు.
ఇందులో ప్రభాస్ రాముడిగా నటిస్తుంటే.సీతగా కృతి సనన్ నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇక లంకేశ్వరుడు రావణాసురిడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తుండగా.లక్ష్మణుడిగా బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్ నటిస్తున్నాడు.ఇక ఇటీవలే ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ చెయ్యగా భారీ ట్రోలింగ్ చేసిన విషయం తెలిసిందే.ఇంత పెద్ద ఎత్తున ట్రోలింగ్ రావడంతో ఈ సినిమాను సంక్రాంతి బరిలో నుండి తప్పిస్తూ జూన్ 16కు వాయిదా వేశారు.
ప్రేక్షకులకు పూర్తిగా అద్భుతమైన విజువల్ అనుభూతి ఇవ్వడం కోసం వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.ఇక ఈ సినిమా వాయిదా వేసినప్పటి నుండి పలు ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి.
రీషూట్ చేయనున్నారని కూడా వార్తలు వచ్చాయి.అయితే ఇప్పుడు మరో బజ్ వినిపిస్తుంది.
ఈ సినిమా జనవరి నుండి జూన్ కు వాయిదా వేయగా ఇక ఇప్పుడు జూన్ లో కూడా రిలీజ్ అవ్వడం లేదంటూ మరో వార్త వస్తుంది.
ఈ సినిమాను జూన్ 16న కూడా రిలీజ్ చేసే అవకాశం లేదని ఆ వచ్చే ఏడాది రిలీజ్ అవ్వబోతుంది అంటూ పుకార్లు వినిపిస్తున్నాయి.ఈ రూమర్స్ విన్న ఫ్యాన్స్ మాత్రం షాక్ అవుతున్నారు.ఈసారి ఈ రూమర్స్ బాగా గట్టిగానే వినిపిస్తుండగా ఇది నిజమో కాదో తెలియడం లేదు.
రానున్న కాలమే నిజానిజాలు బయట పెట్టనున్నాయి.చూడాలి అప్పటి పరిస్థితులు మారతాయో.