ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందబోతున్న ఆదిపురుష్కు సంబంధించిన నటీనటుల ఎంపిక చకచక జరుగుతోంది.ఇప్పటికే విలన్ గా సైఫ్ అలీఖాన్ కనిపించబోతున్నట్లుగా క్లారిటీ వచ్చేసింది.
రావణుడి పాత్రలో సైఫ్ రాముడి పాత్రలో ప్రభాస్ను ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ ఎదురు చూస్తున్న ప్రేక్షకులు ఇప్పుడు సీత పాత్రలో ఎవరు నటించబోతున్నారు అనే విషయంలో ఆసక్తిగా ఉన్నారు.కీర్తి సురేష్ నుండి మొదలుకుని కియారా అద్వానీ వరకు చాలా మంది పేర్లు పరిశీలనకు వచ్చాయి.
చివరకు ఈ సినిమాలో ఊర్వశి రౌతల నటించబోతున్నట్లుగా క్లారిటీ వచ్చేసింది అంటూ ఒక ప్రముఖ జాతీయ మీడియా సంస్థ కథనంను రాసింది.
జాతీయ మీడియాలో కథనం రావడంతో అంతా కూడా ఊర్వశి ‘సీత’గా కనిపించబోతుందని ఊహల్లో ఉన్నారు.
కాని తాజాగా చిత్ర యూనిట్ సభ్యుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఊర్వశి ని ఇంకా కన్ఫర్మ్ చేయలేదని హీరోయిన్ పాత్ర విషయంలో ఇంకా ఎవరు కూడా ఖరారు కాలేదు అంటూ చిత్ర డైరెక్షన్ టీం క్లారిటీ ఇచ్చింది.ఊర్వశి కూడా ఈ విషయంలో సన్నిహితుల వద్ద స్పందిస్తూ ఆ సినిమా కోసం తనను సంప్రదించలేదు అంటూ పేర్కొందట.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ను సీత పాత్రలో నటింపజేసేందుకు కసరత్తు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది.అతి త్వరలోనే సీత పాత్రలో కనిపించేది ఎవరు అనేది తెలిసే అవకాశం ఉంది.