యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హిందీలో నటించిన ఆదిపురుష్ సినిమా షూటింగ్ పూర్తి అయ్యి చాలా నెలలు అయింది.అయినా ఇప్పటి వరకు విడుదల తేదీ విషయంలో కన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు.
వచ్చే ఏడాది ఆరంభంలో అంటూ గతంలో ప్రకటించారు, కానీ కాస్త అటు ఇటు అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి.ఇక ఈ సినిమా యొక్క టీజర్ ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారంటూ సమాచారం అందుతుంది.
ఇప్పటి వరకు కనీసం ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయక పోవడంతో ప్రభాస్ అభిమానులు అంతా ఆవురావురుమంటూ ఎదురు చూస్తున్నారు.కచ్చితంగా సినిమా టీజర్ విడుదలయితే అంచనాలు పది రెట్లు పెరిగే అవకాశం ఉందంటూ అంతా ఆసక్తిగా ఉన్నారు.
ఎట్టకేలకు దసరా సందర్భంగా సినిమా యొక్క టీజర్ ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యుల నుండి సమాచారం అందుతుంది.
దసరాకు అయోధ్యలో భారీ ఈవెంట్ నిర్వహించి ఈ టీజర్ లాంచ్ చేయబోతున్నట్లుగా ప్రకటించారు.
యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ చేతుల మీదుగా ఆదిపురుష్ సినిమా యొక్క టీజర్ విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.ఆ విషయమే క్లారిటీ లేదు, కానీ దసరా రోజు అయోధ్యలో ఈ సినిమా యొక్క టీజర్ విడుదల అవ్వడం కన్ఫామ్ అంటూ చిత్ర యూనిట్ సభ్యులు అనధికారికంగా సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు.
అయోధ్యలో జరగబోతున్న భారీ ఈవెంట్ కి దేశవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు తెలియజేస్తున్నారు.ఈ సినిమా యొక్క పబ్లిసిటీ కార్యక్రమాలు దసరా రోజు నుండి మొదలవుతాయని కూడా అంటున్నారు.
కనుక వచ్చే ఏడాది జనవరిలోనే ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉందంటూ చాలా మంది నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.టీజర్ విడుదలైన తర్వాత సినిమా గురించి మరింతగా చర్చ జరిగే అవకాశం ఉంది.
ప్రపంచ వ్యాప్తంగా పదుల భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.ఆల్ టైం రికార్డ్ వసూళ్లను ఈ సినిమా దక్కించుకుంటుందనే నమ్మకాన్ని అంతా వ్యక్తం చేస్తున్నారు.