పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో ఇప్పటికే నాలుగు సినిమాలు ఉన్నాయి.ఈ సినిమాలు పూర్తి కాకుండానే ఇంకా డైరెక్టర్లు వెంటపడుతూనే ఉన్నారు.
ప్రభాస్ చేతిలో నాలుగు పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఉన్నాయి.ఇంకా అవి సెట్స్ మీదనే ఉన్నాయి.
అయినా కూడా ప్రభాస్ తన నెక్స్ట్ సినిమా ప్రకటించ డానికి రెడీ అవుతున్నాడు.ప్రభాస్ కెరీర్ లో 25వ సినిమాను అనౌన్స్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.
గత కొన్ని రోజులుగా ప్రభాస్ 25వ సినిమా గురించి సోషల్ మీడియా చర్చ జరుగుతుంది.త్వరలోనే ప్రభాస్ 25వ సినిమా ప్రకటన రాబోతుందని గత మూడు నాలుగు రోజులుగా వార్తలు వస్తున్నాయి.
ఈ సినిమా అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగ డైరెక్ట్ చేయబోతున్నాడు.అంతేకాదు ఈ సినిమా టైటిల్ కూడా ఇదే అంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
#Prabhas25 వ సినిమాకు ‘స్పిరిట్’ అనే టైటిల్ ను అనుకుంటున్నట్టు టాక్.
అర్జున్ రెడ్డి సినిమాతో సంచలన హిట్ నమోదు చేసిన సందీప్ వంగ తో సినిమా అంటే అదే రేంజ్ లో ఎక్సపెక్ట్ చేస్తారు అభిమానులు.పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో ఈ సినిమాను టి సిరీస్ సంస్థ, యువీ క్రియేషన్స్ బ్యానర్ కలిసి సంయుక్తంగా నిర్మించ బోతున్నాయని తెలుస్తుంది.ఒక వేళ అదే నిజమైతే ఈ సినిమా వచ్చే సంవత్సరం సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.
ఇక ప్రభాస్ ప్రెసెంట్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా, ఇంకా ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.ఈ మూడు సినిమాలు ప్రెసెంట్ సెట్స్ మీదనే ఉన్నాయి.ఈ మూడు సినిమాలు కూడా వచ్చే ఏడాది లోనే అభిమానుల ముందుకు రాబోతున్నాయి.ఇక వీటితో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే కూడా చేస్తున్నాడు.
ఇవన్నీ పూర్తి అయితే కానీ సందీప్ వంగ సినిమా సెట్స్ మీదకు వెళ్ళదు.